
భారత్-ఒమన్ దేశాల మధ్య కీలక ట్రేడ్ డీల్ జరిగింది. ఒమన్ నుంచి భారతదేశానికి దిగుమతి అయ్యే వస్తువులకు కస్టమ్స్ సుంకం రాయితీలు కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త నిర్ణయం 2026 జూన్ 1 నుంచి అమల్లోకి వస్తుందని కేంద్ర ఆర్ధికశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఒమన్ నుంచి భారత్కు దిగుమతి అయ్యే అనేక వస్తువులపై కస్టమ్స్ సుంకం మినహాయింపులు అమల్లో ఉంటాయిన ఉత్తర్వుల్లో పేర్కొంది. గత ఏడాది డిసెంబర్లోనే ఇరు దేశాలు వాణిజ్య ఒప్పందంపై సంతకాలు చేశాయి. సుదీర్ఘ సమయం తర్వాత ఇప్పటినుంచి అమల్లోకి తీసుకొచ్చారు. దీని వల్ల ఇరు దేశాల మధ్య వాణిజ్యం పెరగడంతో పాటు రెండు దేశాలకు ప్రయోజనం కలగనుంది. దిగుమతిదారులకు మరింత ప్రయోజనం చేకూరనుందని మార్కెట్ వర్గాలు చెబతున్నాయి.
ఒమన్ నుంచి ఖర్జూరాలు, పాలరాయి, పెట్రోకెమికల్ వస్తువులతో సహా అనేక వస్తువులను భారత్ దిగుమతి చేసుకుంటుంది. దీంతో అక్కడ నుంచి భారత్ దిగుమతి చేసుకునే 94.81 శాతం వస్తువులకు కస్టమ్స్ సుంకంలో మినహాయింపులు లభించనున్నాయి. దీంతో ఇరు దేశాల మధ్య వాణిజ్యం సులభతరం కానుంది. అయితే మినహాయింపు పొందేందుకు కొన్ని షరతులు విధించారు. ఒమాన్ నుండే వస్తువులు వచ్చాయని దిగుమతిదారులు నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం పలు ఆధారాలు చూపించాల్సి ఉంటుంని ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఒమన్ నుంచి వస్తువులను తీసుకొచ్చినట్లు అవసరమైన పత్రాలను కస్టమ్స్ అధికారులకు సమర్పించాలి. కస్టమ్స్ డిప్యూటీ కమిషనర్ లేదా అసిస్టెంట్ కమిషనర్ పరిశీలించిన తర్వాత కస్టమ్స్ సుంకం చెల్లింపుల్లో మినహాయింపు కల్పి్స్తారు. ఒమాన్లో తయారైన సరుకులు మాత్రమే కస్టమ్స్ సుంకం చెల్లింపు ప్రయోజనం అందిస్తారని కేంద్ర ప్రభుత్వం తన నోటిఫికేషన్లో పేర్కొంది.
భారత్, ఒమన్ల మధ్య వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం అవుతాయి. ఇప్పటికే ఇంధనం, వాణిజ్యంలో భాగస్వాములుగా రెండు దేశలు ఉన్నాయి. ఇప్పుడు సుంకాల రాయితీలు వాణిజ్యాన్ని పెంచి, భారత మార్కెట్లో ఒమన్ ఉత్పత్తులను మరింత పోటీపడేలా చేస్తాయి. అలాగే రెండు దేశాల వ్యాపారాలకు కొత్త అవకాశాలు లభించేలా చేస్తాయని ఆర్ధిక విశ్లేషకులు చెబుతున్నారు. ఒమన్-భారత్ మధ్య సంబంధాలు మరింత మెరుగయ్యేలా ఈ ఒప్పంద సహాయపడుతుందని చెబుతున్నారు. ఈ ఒప్పందం వల్ల భారత్లో పలు వస్తువలు ధరలు తగ్గుతాయని అంటున్నారు. ఒమన్ నుంచి భారత్ దిగుమతి చేసుకునే వస్తువుల ధరలు తగ్గుముఖం పట్టనున్నాయి. దీని వల్ల దేశ ప్రజలకు లాభం జరగనుంది.