
ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంక్ అయిన ఐసీఐసీఐ బ్యాంక్ మరో కొత్త స్కీమ్ను ప్రవేశపెట్టింది. ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్యూరెన్స్ సరికొత్త పథకాన్ని తీసుకొచ్చింది. అదే సెక్టార్ లీడర్స్ ఇండెక్స్ ఫండ్ పేరుతో కొత్త ఎన్ఎఫ్ఓను ప్రారంభించింది. అసలు ఈ ఫండ్ ఏంటి..? ఇన్వెస్టర్లకు లాభాలు ఎలా ఉంటాయి..? అనే విషయాలు ఇందులో తెలుసుకుందాం

నిఫ్టీ సెక్టార్ లీడర్స్ ఇండెక్స్ ఆధారంగా ఈ ఐసీఐసీఐ ఫండ్ పనితీరు ఉంటుంది. ఆ ఇండెక్స్లో ఉండే సూచీల పనితీరు ఆధారంగా ఇన్వెస్టర్లకు రాబడి వస్తుంది. ఈ ఫండ్ ద్వారా వచ్చే డబ్బులను ఐటీ, ఫార్మా, ఆటోమొబైల్, బ్యాంకింగ్ వంటి రంగాల్లో పెట్టుబడులు పెడతారు. దీర్ఘకాలిక మూలదన వృద్దిని అందించాలనే లక్ష్యంతో ఈ ఫండ్ను ఐసీఐసీఐ కొత్తగా తీసుకొచ్చింది.

ఆర్ధికంగా బలంగా ఉన్న కంపెనీలలో ఈ ఫండ్లో వచ్చే డబ్బులను పెట్టుబడి పెట్టనున్నారు. ఇందులో ఇన్వెస్టర్లకు స్ధిరమైన రాబడి వస్తుంది. ఈ ఫండ్లో పెట్టుబడి పెట్టేవారికి రిస్క్ చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇందులోని డబ్బులను వివిధ రంగాల్లోని ప్రముఖ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తారు. దీని వల్ల రిస్క్ అనేది తక్కువని చెప్పవచ్చు.

ఈ ఫండ్ పాసివ్ ఇన్వెస్టింగ్ పద్దతిని పాటిస్తుంది. అంతేకాకుండా నిర్వహణ ఖర్చులు కూడా తక్కువగా ఉంటాయి. అందుకే పెట్టబడి పెట్టేవారికి అదనపు లాభం కూడా ఉంటుంది. ఈ ఫండ్లో కనీస పెట్టుబడి రూ.వెయ్యి పెట్టాల్సి ఉంటుంది. ఇక గరిష్టంగా ఎంతైనా పెట్టుకోవచ్చు.

అయితే ఐసీఐసీఐ ఇంకా సబ్స్క్రిప్షన్ డేట్లను ఇంకా ప్రకటించలేదు. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ వెబ్ సైట్లో పూర్తి వివరాలను చెక్ చేయాలని బ్యాంకు తెలిపింది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడి పొందాలనుకునేవారికి ఇది మంచి ఫండ్గా చెబుతున్నారు.