
కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇండియా పోస్ట్.. కేవలం ఉత్తరాలు పంపాడానికే కాకుండా దాని సేవలు వివిధ రంగాల్లో విస్తరించిన విషయం తెలిసిందే. పార్సిల్ సర్వీస్, బ్యాంకింగ్ సేవలు కూడా ప్రారంభించింది. మరి అలాంటి పోస్ట్ ఆఫీస్ ఫ్రాంచైజ్ తీసుకోవాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.. ఇండియా పోస్ట్ పోస్ట్ ఆఫీస్ ఫ్రాంచైజ్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇది కేవలం రూ.5000 కనీస పెట్టుబడితో ప్రారంభించవచ్చు.
అర్హత ప్రమాణాలు
పోస్ట్ ఆఫీస్ ఫ్రాంచైజీని ప్రారంభించడానికి, వ్యక్తి గుర్తింపు పొందిన పాఠశాల నుండి చెల్లుబాటు అయ్యే 8వ తరగతి పాస్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. దరఖాస్తు ప్రక్రియలో ఒక ఫారమ్ను పూర్తి చేసి సమర్పించాలి. ఎంపికైన తర్వాత ఇండియా పోస్ట్తో ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంటారు. పోస్ట్ ఆఫీస్ ఫ్రాంచైజీ నుండి వచ్చే ఆదాయాలు కమిషన్ పై ఆధారపడి ఉంటాయి. ఫ్రాంచైజీ పోస్ట్ ఆఫీస్ ద్వారా లభించే వివిధ ఉత్పత్తులు, సేవలను అందిస్తుంది. కమిషన్ రేట్లు ముందుగానే ఒప్పందంలో ఉంటాయి.
ఆసక్తిగల అభ్యర్థులు పోస్టాఫీస్ ఫ్రాంచైజ్ పథకంలో పాల్గొనడానికి రూ.5000 దరఖాస్తు రుసుము చెల్లించాలి. ఈ రుసుమును “అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్, డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్” పేరుతో తయారు చేసిన డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా సమర్పించవచ్చు.
SC/ST వర్గాలకు చెందిన దరఖాస్తుదారులు, మహిళా దరఖాస్తుదారులు, ప్రభుత్వ పథకం కింద ఇప్పటికే ఎంపికైన వారికి దరఖాస్తు రుసుము చెల్లించకుండా మినహాయింపు ఉంది.
పోస్ట్ ఆఫీస్ ఫ్రాంచైజీకి దరఖాస్తు చేసుకోవడానికి, పోస్ట్ ఆఫీస్ అందించిన అధికారిక నోటిఫికేషన్ను జాగ్రత్తగా చదవడం, అధికారిక వెబ్సైట్ ద్వారా మీ దరఖాస్తును సమర్పించడం ముఖ్యం. దరఖాస్తు ఫారమ్ను డౌన్లోడ్ చేసుకోవడానికి, దరఖాస్తు ప్రక్రియను కొనసాగించడానికి మీరు అధికారిక లింక్పై క్లిక్ చేయండి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి