LPG Crisis: ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలి.. ఎల్‌పీజీ గ్యాస్‌పై మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన!

LPG Crisis: ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం కారణంగా దేశంలో వంట గ్యాస్‌పై ఇంకా సంక్షోభం కొనసాగుతోంది. యుద్ధంతో హోర్ముజ్ జలసంధి గుండా కేవలం తొమ్మిది ముడి, గ్యాస్ నౌకలు మాత్రమే ప్రయాణించాయి. దీంతో గ్యాస్‌ వినియోగంపై పెట్రోలియం మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది..

LPG Crisis: ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలి.. ఎల్‌పీజీ గ్యాస్‌పై మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన!
Lpg Gas

Updated on: Mar 20, 2026 | 5:06 PM

LPG Crisis: ఎల్పీజీ సంక్షోభంపై ప్రభుత్వం కీలక ప్రకటన.. జారీ చేసింది, పరిస్థితి తీవ్రంగానే ఉంది, ప్రజలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లను కూడా ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం జరిగి ఇరవై రోజులు గడిచినా, హోర్ముజ్ జలసంధి గుండా కేవలం తొమ్మిది ముడి, గ్యాస్ నౌకలు మాత్రమే ప్రయాణించాయి. దీని ఫలితంగా భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా ఎల్‌పిజి గ్యాస్ కొరత కొనసాగుతోంది. ఎల్‌పిజి పరిస్థితి విషమంగానే ఉందని, సరఫరాలను నిర్ధారించడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని పెట్రోలియం మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ తెలిపారు.

దేశీయ సరఫరాలు, భయాందోళనలు తగ్గుముఖం పట్టాయి:

గృహ వినియోగదారులకు 100% ఎల్‌పిజి సరఫరా చేస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. అయినప్పటికీ పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. భయాందోళనలతో చేసే బుకింగ్‌లు తగ్గినప్పటికీ, వదంతులను పట్టించుకోకుండా, అవసరమైనంత మేరకే గ్యాస్ బుక్ చేసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ఇది కూడా చదవండి: భారీగా పడిపోతున్న వెండి ధర.. జస్ట్‌ 10 రోజుల్లో ఎంత తగ్గిందో తెలిస్తే అవాక్కవుతారు!

ప్రభుత్వ విజ్ఞప్తి:

ఎల్పీజీ పరిస్థితి దారుణంగానే ఉందని ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంది. సరఫరాలను కొనసాగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ ప్రజలు ప్రత్యామ్నాయ ఇంధన మార్గాలను పరిశీలించుకోవాలని, భయాందోళనలతో కొనుగోళ్లు చేయవద్దని విజ్ఞప్తి చేసింది.

ఇది కూడా చదవండి: Diesel Price: దిమ్మదిరిగే షాకిచ్చిన చమురు కంపెనీలు.. భారీగా పెరిగిన డీజిల్ ధర

బ్లాక్ మార్కెటింగ్‌పై కఠిన చర్యలు:

బ్లాక్‌ మార్కెట్‌ నిల్వలపై ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. నివేదికల ప్రకారం.. పలు రాష్ట్రాల్లో 4,500కు పైగా దాడులు జరిగాయి. ప్రజలకు ఎల్పీజీ సరఫరాలు సక్రమంగా అందేలా చూడటమే దీని లక్ష్యం.

దేశీయ ఉత్పత్తిలో పెరుగుదల:

ప్రభుత్వం ఎల్పీజీ ఉత్పత్తిని పెంచడంపై కూడా దృష్టి సారించింది. ప్రస్తుతం దేశీయ ఉత్పత్తి సుమారు 40 శాతానికి చేరుకోవడంతో దిగుమతులపై ఆధారపడటం తగ్గింది. గల్ఫ్‌లో భారతీయులు సురక్షితంగా ఉన్నారు. కానీ పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. ఇదిలా ఉండగా, గల్ఫ్ ప్రాంతంలో చిక్కుకుపోయిన 22 భారతీయ నౌకలు, నావికులు సురక్షితంగా ఉన్నారని రాకేష్ సిన్హా తెలిపారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకారం.. ప్రధానమంత్రి ఒమన్, ఖతార్ సహా పలు గల్ఫ్ దేశాలతో, ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ వంటి ప్రపంచ నాయకులతో మాట్లాడారని, దౌత్యపరమైన పరిష్కారంపై ఆయన మాట్లాడారని రణధీర్ జైస్వాల్ పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: Gold, Silver Prices: చరిత్రలో భారీ పతనం.. బంగారంపై రూ.50 వేలు.. వెండిపై రూ.2 లక్షలు తగ్గింపు..!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us