
Gold Price Today: దేశంలో కొన్ని రోజుల్లో పండుగ సీజన్ ప్రారంభమవుతుంది. దుర్గా పూజ తర్వాత దీపావళి, ధంతేరస్ వస్తాయి. ఈ సందర్భాలలో బంగారం, వెండి కొనడం ఒక సంప్రదాయం. అయితే ఈసారి పండుగ కొంచెం తక్కువగా ఉండవచ్చు, ఎందుకంటే బంగారం, వెండి చాలా ఖరీదైనవిగా మారాయి. సెప్టెంబర్ 20వ తేదీన దేశీయంగా బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. నిన్నటితో పోలిస్తే తులంపై 200 రూపాయలకుపైగా ఎగబాకింది. తులం బంగారం ధర రూ.1,11,340 వద్ద ఉంది.
గత సంవత్సరంలో బంగారం దాదాపు 46% ఖరీదైనదిగా మారాయి. ఈ సంవత్సరంలోనే అంటే, 2025లో బంగారం ధర 40% పెరిగింది. ఒక సంవత్సరం క్రితం 10 గ్రాముల 24K క్యారెట్ బంగారం ధర సుమారు రూ.75,000 ఉండగా, ఇప్పుడు అది రూ.111,000 దాటేసింది.
పండుగ సీజన్లో షాపింగ్ చేసే వారితో పాటు, ఈ సంవత్సరం పెళ్లిళ్లు చేసుకునే వారు కూడా ఆందోళన చెందుతున్నారు. నగలు లేకుండా పెళ్లి జరగని పరిస్థితి. తులం బంగారం కొనాలంటే సుమారు 1 లక్ష 12 వేల వరకు పెట్టుకోవాల్సిందే. ఒక వైపు దీపావళి నాటికి తులం ధర రూ.1.25 లక్షల వరకు పెరగవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి