Gold Rate Today: తగ్గేదేలే.. మళ్లీ పెరిగిన పసిడి ధరలు.. హైదరాబాద్, విజయవాడలో తులం ఎంత ఉందంటే..

Gold And Silver Price In Hyderabad - Vijayawada: పసిడి ధరలు పరుగులు పెడుతున్నాయి.. గతంలో ఎన్నడూ లేని విధంగా లక్ష మార్కుకు చేరువైంది.. అంతర్జాతీయంగా ఏర్పడిన ఆర్థిక ఉద్రిక్తతలతో బంగారం రేటు చుక్కలనంటుతోంది. అమెరికా, చైనాల మధ్య సుంకాల పోరు, ఇంకా అంతర్జాతీయంగా నెలకొన్న పలు పరిణామాల నేపథ్యంలో పసిడి ధర రికార్డు స్థాయికి చేరింది.

Gold Rate Today: తగ్గేదేలే.. మళ్లీ పెరిగిన పసిడి ధరలు.. హైదరాబాద్, విజయవాడలో తులం ఎంత ఉందంటే..
Gold And Silver Price

Updated on: Apr 18, 2025 | 6:14 AM

Gold And Silver Price In Hyderabad – Vijayawada: పసిడి ధరలు పరుగులు పెడుతున్నాయి.. గతంలో ఎన్నడూ లేని విధంగా లక్ష మార్కుకు చేరువైంది.. అంతర్జాతీయంగా ఏర్పడిన ఆర్థిక ఉద్రిక్తతలతో బంగారం రేటు చుక్కలనంటుతోంది. అమెరికా, చైనాల మధ్య సుంకాల పోరు, ఇంకా అంతర్జాతీయంగా నెలకొన్న పలు పరిణామాల నేపథ్యంలో పసిడి ధర రికార్డు స్థాయికి చేరింది. ప్రస్తుతం బులియన్ మార్కెట్‌లో స్వచ్ఛమైన పసిడి ధర 98వేలకు చేరుకుంది. తాజాగా బంగారం ధర పెరగగా.. వెండి ధర స్వల్పంగా తగ్గింది. 18 ఏప్రిల్ 2025 శుక్రవారం ఉదయం ఆరు గంటల వరకు పలు వెబ్‌సైట్లలో నమోదైన ధరల ప్రకారం.. దేశీయంగా 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.89,210, 24 క్యారెట్ల పది గ్రాముల గోల్డ్ ధర రూ.97,320 గా ఉంది. వెండి కిలో ధర రూ.99,900 లుగా ఉంది. కాగా.. బంగారం పది గ్రాములపై రూ.10 మేర ధర పెరగగా.. వెండి కిలోపై రూ.100 మేర ధర తగ్గింది. కాగా.. ప్రాంతాల వారీగా బంగారం, వెండి ధరల్లో వ్యత్యాసం ఉంటుంది. ఇంకా ప్రతిరోజూ ధరల్లో మార్పులు జరుగుతుంటాయి..

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి..

బంగారం ధరలు..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.89,210, 24 క్యారెట్ల ధర రూ.97,320 గా ఉంది.

విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.89,210, 24 క్యారెట్ల ధర రూ.97,320గా ఉంది.

ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.89,360, 24 క్యారెట్ల ధర రూ.97,470 గా ఉంది.

ముంబైలో 22 క్యారెట్ల ధర రూ.89,210, 24 క్యారెట్ల ధర రూ.97,320 గా ఉంది.

చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.89,210, 24 క్యారెట్ల రేటు రూ.97,320 గా ఉంది.

బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ.89,210, 24 క్యారెట్ల ధర రూ.97,320 గా ఉంది.

వెండి ధరలు..

  • హైదరాబాద్‌‌లో కిలో వెండి ధర రూ.1,09,900
  • విజయవాడ, విశాఖపట్నంలో రూ.1,09,900
  • ఢిల్లీలో వెండి కిలో ధర రూ.99,900 లుగా ఉంది.
  • ముంబైలో రూ.99,900గా ఉంది.
  • బెంగళూరులో రూ.99,900
  • చెన్నైలో రూ.1,09,900 లుగా ఉంది.

కాగా, ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవిగా గమనించగలరు. ఒకవేళ మీకు బంగారం, వెండి ధరల లేటెస్ట్ అప్‌డేట్ గురించి తెలియాలంటే ఈ మొబైల్ నెంబర్‌కు 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..