బంగారం ధరలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. మొన్నటి వరకు తగ్గుదల కనిపించిన పసిడి ప్రస్తుతం వరుసగా పెరుగుతూ పోతోంది. నిన్న హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన తులం బంగారం ధర రూ. 73,750కాగా ఈరోజు మరింత పెరిగింది. ప్రస్తుతం 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 73,760గా కొనసాగుతోంది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర కూడా పెరిగింది. నిన్న 10గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 67,600కాగా ఈరోజు తులంపై రూ. 10 పెరిగి రూ. 67,610కు చేరింది. అలాగే వెండి ధరలు కూడా ఆకాశాన్ని తాకుతున్నాయి. నిన్న హైదరాబాద్ మార్కెట్లో కేజీ వెండి ధర రూ.10,050 కాగా ఈరోజు కిలోపై రూ.10 పెరిగి రూ. 10,060 వద్ద కొనసాగుతోంది. దేశ వ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలాగున్నాయో ఇప్పుడు చూద్దాం.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..