Gold Price Today: మరోసారి తగ్గిన బంగారం ధర.. తులం గోల్డ్‌ ఎంతకు చేరిందో తెలుసా.?

|

Jul 31, 2024 | 6:30 AM

మొన్నటి వరకు ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గుముఖం పడుతు వస్తున్నాయి. ముఖ్యంగా కేంద్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టిన తర్వాత గోల్ఢ్‌ ధరలు భారీగా తగ్గుతున్నాయి. రూ. 80 వేల మార్క్‌కు చేరుకున్న తులం బంగారం ధర ఒక్కసారిగా రూ. 68 వేల స్థాయికి తగ్గడం విశేషం. తాజాగా బుధవారం కూడా దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో...

Gold Price Today: మరోసారి తగ్గిన బంగారం ధర.. తులం గోల్డ్‌ ఎంతకు చేరిందో తెలుసా.?
Gold Price Today
Follow us on

మొన్నటి వరకు ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గుముఖం పడుతు వస్తున్నాయి. ముఖ్యంగా కేంద్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టిన తర్వాత గోల్ఢ్‌ ధరలు భారీగా తగ్గుతున్నాయి. రూ. 80 వేల మార్క్‌కు చేరుకున్న తులం బంగారం ధర ఒక్కసారిగా రూ. 68 వేల స్థాయికి తగ్గడం విశేషం. తాజాగా బుధవారం కూడా దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో బంగారం ధరలో తగ్గుదల కనిపించింది. ఇంతకీ లేటెస్ట్ గోల్డ్ ప్రైజ్‌ ఎలా ఉంది.? దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరల పొజిషన్‌ ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం..

* దేశ రాజధాని న్యూఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 63,340కాగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 69,090 వద్ద కొనసాగుతోంది.

* ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబయి విషయానికొస్తే ఇక్కడ 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 63,190కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 68,940 వద్ద కొనసాగుతోంది.

* చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 63,840కాగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 69,640వద్ద కొనసాగుతోంది.

* బెంగళూరు విషయానికొస్తే ఇక్కడ 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 63,190కాగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 68,940 వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు..

* హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 63,190గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 68,940 వద్ద కొనసాగుతోంది.

* విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 63,190కాగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 68,940గా ఉంది.

* ఇక సాగరనగరం విశాఖలో కూడా 22 క్యారెట్ల తులం గోల్డ్ ధర రూ. 63,190, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 68,940 వద్ద కొనసాగుతోంది.

వెండి ధర విషయానికొస్తే..

వెండి ధర కూడా తగ్గుముఖం పట్టింది. బుధవారం దేశంలోని పలు అన్ని ప్రధాన నగరాల్లో కిలో వెండిపై రూ. 100 వరకు తగ్గింది. దీంతో న్యూఢిల్లీతో పాటు కోల్‌కతా, ముంబయి, పుణె వంటి నగరాల్లో కిలో వెండి ధర రూ. 84,600 వద్ద కొనసాగుతోంది. అలాగే హైదరాబాద్‌, కేరళ, చెన్నై, విజయవాడ, విశాఖల కిలో వెండి ధర రూ. 88,900వద్ద కొనసాగుతోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..