ఇకపై సిగరేట్‌ తాగడం అంత ఈజీ కాదు! అలవాటు మానకుంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే..!

సిగరెట్లపై ఎక్సైజ్ సుంకాన్ని భారీగా పెంచాలనే ప్రభుత్వ కొత్త బిల్లుతో ఒక్క సిగరెట్ ధర రూ.18 నుండి రూ.72కు చేరవచ్చు. ధూమపానం తగ్గించి, ప్రజలు అలవాటు మానేసేలా ప్రోత్సహించడమే దీని లక్ష్యం. ప్రత్యేకించి యువతలో పొగతాగే వారి సంఖ్యను నియంత్రించాలని ప్రభుత్వం ఆశిస్తోంది.

ఇకపై సిగరేట్‌ తాగడం అంత ఈజీ కాదు! అలవాటు మానకుంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే..!
Cigarette

Updated on: Dec 28, 2025 | 10:12 AM

చాలా మందికి సిగరేట్‌ తాగడం ఒక అలవాటు మాత్రమే కాకుండా వ్యసనంలా మారి ఉంటుంది. ఎంత మంది ఎన్నిసార్లు చెప్పినా అలాంటి వాళ్లు సిగరేట్‌ అలవాటు మానరు. ధూమపానం క్యాన్సర్‌కు దారితీస్తుందని, ఆరోగ్యం నాశనం చేస్తుందని ఎన్ని ప్రకటనలు చేసినా, సిగరేట్‌ పెట్టేలపై భయపెట్టే విధంగా క్యాన్సర్‌కు సంబంధించిన ఫొటోలు ముద్రించినా కూడా కొంతమందిలో అసలు మార్పు రావడం లేదు. అలాంటి వాళ్లు కూడా ఇకపై సిగరేట్‌ తాగడం అంత ఈజీ కాదు. ఎందుకంటే.. ఒక్క సిగరేట్‌ కొనాలంటే ఏకంగా రూ.72 ఖర్చు చేయాల్సి రావొచ్చు. రోజులో ఓ నాలుగు సిగరేట్లు కాల్చిన వచ్చే ఆదాయం 30, 40 శాతం వాటికే పోవడం ఖయం.

సిగరెట్ అమ్మకాలను అరికట్టడానికి ఎక్సైజ్ సుంకాన్ని గణనీయంగా పెంచుతామని ప్రభుత్వం కొత్త బిల్లు చెబుతోంది. ప్రస్తుతం రూ.18 ఖరీదు చేసే ఒక సిగరెట్ ధర త్వరలో రూ.72కి చేరుకోవచ్చని అధికారులు తెలిపారు. ఈ నిర్ణయాన్ని కొందరు స్వాగతిస్తూ, ఇది మానేయడాన్ని ప్రోత్సహిస్తుందని ఆశించినప్పటికీ, సోషల్ మీడియా మిశ్రమ స్పందనలతో నిండి ఉంది. ఒక రెడ్డిట్ యూజర్ ధరల పెరుగుదల గురించి తాజా అప్‌డేట్ స్క్రీన్‌షాట్‌ను పోస్ట్ చేసి, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అభినందించాడు.

నేను ధూమపానం చేసేవాడిగా, నాకు ఈ నిర్ణయం నచ్చింది అని ఆయన రాశారు. ఇది భారతదేశంలో ధూమపానం చేసేవారి సంఖ్యను, ముఖ్యంగా విద్యార్థులు, యువకులను తగ్గిస్తుందని నేను ఆశిస్తున్నాను. నేను కూడా ధూమపానం మానేయగలను అని ఆయన అన్నారు. ఇలా అధిక ధరలతో సిగరేట్‌ అలవాటు తగ్గుతుందని అధికారులు, ప్రభుత్వం భావిస్తోంది. మరి ఫలితం ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి