Gold Rates: బంగారం ధర మళ్లీ రూ. 75,000 చేరుకుంటుందా? నిపుణులు ఏం చెబుతున్నారు?

|

Aug 16, 2024 | 4:04 PM

భారతీయ బంగారం ధరలు విదేశీ మార్కెట్‌తో సంబంధం కలిగి ఉన్నాయని, అందువల్ల భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, యూఎస్ పాలసీ నిర్ణయాలు, యూఎస్ డాలర్ పనితీరు, సెంట్రల్ బ్యాంక్ కొనుగోలు, ప్రపంచ వృద్ధి ఔట్‌లుక్ వంటి అంశాలు భవిష్యత్ ధరల కదలికలను ప్రభావితం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

Gold Rates: బంగారం ధర మళ్లీ రూ. 75,000 చేరుకుంటుందా? నిపుణులు ఏం చెబుతున్నారు?
Gold Price
Follow us on

గత కొంత కాలంగా స్పల్పంగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు మళ్లీ నెమ్మదిగా పుంజుకుంటున్నాయి. కేంద్ర బడ్జెట్లో బంగారం అక్రమ రవాణాను నిరోధించడంతో పాటు దేశీయ కొనుగోళ్లు పెంచేందుకు తీసుకున్న కస్టమ్స్ డ్యూటీ తగ్గింపు.. అనంతర పరిణామాల్లో బంగారం ధరలు కాస్త తగ్గాయి. ప్రస్తుతం ఆ ట్రెండ్ అలాగే కొనసాగుతూ వస్తోంది. కాగా గత బుధవారం అంటే ఆగస్టు 14వ తేదీన పది గ్రాముల బంగారం ధర స్వల్పంగా అంటే రూ. 76 పెరిగి రూ. 70,775 వద్ద నిలిచింది. బంగారానికి ఏర్పడుతున్న తక్షణ డిమాండ్ ఆధారంగా ఈ పెరుగుదల కనిపించింది. మరో వైపు మార్కెట్లో అస్థిరత పెరుగుతున్నప్పటికీ, బంగారం దృక్పథం సానుకూలంగానే ఉంది. యూఎస్ ఫెడ్ 50 బేసిస్ పాయింట్ల తగ్గింపును అమలు చేస్తే, మెటల్స్ మార్కెట్లో గణనీయమైన ర్యాలీని అంచనా వేయవచ్చని నిపుణులు చెబుతున్నారు.

బంగారం ధర ఎందుకు పెరిగింది..

భౌగోళిక, రాజకీయ పరిస్థితులు ముఖ్యంగా మిడ్ ఈస్ట్లో  పెరుగుతున్న ఉద్రిక్తతలు కూడా బంగారం ధరలకు మద్దతు ఇస్తున్నాయి. యూఎస్ బెంచ్‌మార్క్ 10-సంవత్సరాల ట్రెజరీ దిగుబడి కూడా పడిపోయింది. కాగా అమెరికా డాలర్ కూడా దిగువకు చేరుకుంది. అదనంగా, సెంట్రల్ బ్యాంకులు డాలర్ నిల్వలను బంగారంలోకి మారుస్తున్నాయి. ఇది కూడా ధరల పెరుగుదలకు కారణమవుతోంది. ఈ సంవత్సరం జూలైలో, అంతర్జాతీయ స్పాట్ గోల్డ్ మార్కెట్‌లలో విలువైన మెటల్ రికార్డు గరిష్ట స్థాయి 2,480 డాలర్లకు ఎగబాకింది. దీని కారణంగా పసుపు లోహం ధర భారతీయ మార్కెట్‌లో గణనీయమైన స్థాయికి చేరుకుంది. దీంతో 10 గ్రాముల ధర రూ. 75,000కి చేరుకుంది. అయితే జూలై 23న, బడ్జెట్ ప్రకటన రోజున, ఎంసీఎక్స్‌లో బంగారం ధరలు రూ.4,000 కంటే ఎక్కువ క్షీణించి, 10 గ్రాములకు సుమారు రూ. 68,500కి చేరుకున్నాయి. ఈ గణనీయమైన తగ్గుదల కస్టమ్స్ డ్యూటీ తగ్గింపు కారణంగా జరిగింది.

మళ్లీ పెరుగుతుందా..

భారతీయ బంగారం ధరలు విదేశీ మార్కెట్‌తో సంబంధం కలిగి ఉన్నాయని, అందువల్ల భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, యూఎస్ పాలసీ నిర్ణయాలు, యూఎస్ డాలర్ పనితీరు, సెంట్రల్ బ్యాంక్ కొనుగోలు, ప్రపంచ వృద్ధి ఔట్‌లుక్ వంటి అంశాలు భవిష్యత్ ధరల కదలికలను ప్రభావితం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అదనంగా మన రూపాయి పనితీరు, దేశీయ డిమాండ్‌లో వైవిధ్యాలు కూడా స్థానిక బంగారం ధరలను ప్రభావితం చేయవచ్చని వివరిస్తున్నారు. ఈ క్రమంలో అతి తక్కువ కాలంలోనే బంగారం ధర రూ. 75,000 చేరుకునే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..