పెరగనున్న మొబైల్ చార్జీల ధరలు!

మొబైల్ చార్జీల ధరలు పెరగబోతున్నాయి. మొబైల్ చార్జీల రేట్స్ పెరుగుతాయని సంకేతాలిచ్చారు భారతీ ఎయిర్‌టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. ఆరు నెలల్లో మొబైల్ చార్జీల మోత తప్పదని అంటున్నారు. తక్కువ డేటా ధరలతో..

పెరగనున్న మొబైల్ చార్జీల ధరలు!

Updated on: Aug 25, 2020 | 10:23 AM

మొబైల్ చార్జీల ధరలు పెరగబోతున్నాయి. మొబైల్ చార్జీల రేట్స్ పెరుగుతాయని సంకేతాలిచ్చారు భారతీ ఎయిర్‌టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. ఆరు నెలల్లో మొబైల్ చార్జీల మోత తప్పదని అంటున్నారు. తక్కువ డేటా ధరలతో టెలికాం పరిశ్రమకు తీవ్ర నష్టాలు వస్తున్నాయన్నారు. ప్రస్తుతం భారత్‌లో రూ.160కే నెలకు 16 జీబీ లభించడం దారుణమని అన్నారు సునీల్ మిట్టల్. 5జీ టెక్నాలజీని అందింపుచ్చుకోవడానికి పెట్టుబడుల కోసం.. టెలికాం సంస్థలు ఎదురు చూస్తున్నాయని భారతీ ఎయిర్‌టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్ పేర్కొన్నారు. దీంతో ఈ లెక్కన చూస్తే.. వచ్చే ఆరు నెలల్లో మొబైల్ చార్జీల ధరల మోత భారీగానే పెరిగే అవకాశాలున్నట్లు కనిపిస్తోంది.

Also Read:

ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ ఉధృతి.. 2.38 కోట్లకి చేరిన కేసులు

సరదాగా చేపలు పట్టిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే

ప్రముఖ సీనియర్ నటి ఇంట విషాదం

డబ్బులు కావాలంటే కాల్ చేయండి.. ఏటీఎం ఇంటికే వచ్చేస్తుంది

Loading...
Unable to load recommendations.
Follow Us