
దీపావళి సందర్భంగా మొబైల్ కొనాలనుకుంటున్నారా? అయితే మీకు ఫ్లిప్ కార్ట్ , అమెజాన్ లు పోటీ పడి మరీ ఆఫర్లు అందిస్తున్నాయి. ముఖ్యంగా అమెజాన్ లో ఖరీదైన ఫ్లాగ్ షిప్ మొబైల్స్ పై కూడా మంచి డిస్కౌంట్స్ కనిపిస్తున్నాయి. ఫోన్ అప్ గ్రేడ్ చేయాలనుకునే వాళ్లు ఈ డీల్స్ పై ఓ లుక్కేయండి!
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ దీపావళి సేల్ మొదలైంది. ఇందులో శాసంగ్, యాపిల్ వంటి ప్రీమియం బ్రాండ్ మొబైల్స్ పై మంచి ఆఫర్లు ఉన్నాయి. శాంసంగ్ గెలాక్సీ ఎస్24 అల్ట్రా 5జీ మొబైల్ అసలు ధర రూ. లక్ష వరకూ ఉండగా అమెజాన్లో ఈ ఫోన్ రూ. 75,749కి అందుబాటులో ఉంది. ఈ మొబైల్ 6.8 అంగుళాల స్క్రీన్ , స్నాప్ డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ తో వస్తుంది. ఇందులో 200MP ప్రైమరీ లెన్స్ కలిగిన క్వాడ్-కెమెరా సెటప్ ఉంటుంది. 5,000 mAh బ్యాటరీతో వస్తుంది.
అమెజాన్ దివాళీ సేల్ లో ఐఫోన్ 16పై కూడా మంచి డిస్కౌంట్ ఉంది. ఈ మొబైల్ అసలు ధర రూ. 79,900 కాగా సేల్ లో రూ. 66,900కి లభిస్తుంది. అది కూడా 256 జీబీ వేరియంట్. ఇందులో 6.1 అంగుళాల డిస్ప్లే, 48MP ప్రైమరీ కెమెరా ఉన్నాయి. యాపిల్ A18 చిప్సెట్ పై పనిచేస్తుంది.
ఇకపోతే అమెజాన్ లో లభిస్తున్న మరో ఫ్లాగ్ షిప్ ఫోన్ వన్ ప్లస్ 13. ఈ ఫోన్ ధర రూ. 72,999 కాగా సేల్లో ఇది రూ. 63,999కి అందుబాటులో ఉంది. ఇది స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ పై పనిచేస్తుంది. 50MP ప్రైమరీ లెన్స్ కలిగిన ట్రిపుల్ కెమెరా సెటప్తో వస్తుంది. బ్యాటరీ కెపాసిటీ 6000 mAh ఉంటుంది.
మరిన్ని సైన్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..