Budget 2024: పాన్ లేకుండా రూ. 5 లక్షల వరకు బంగారం కొనుగోలు.. బడ్జెట్‌లో కీలక ప్రకటన చేసే ఛాన్స్!

బడ్జెట్‌ సమర్పణకు మరికొన్ని గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది. దేశ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న తన 6వ, మొదటి మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. అయితే ఈ బడ్జెట్‌లో ఎలాంటి విధానపరమైన నిర్ణయం ఉండకపోవచ్చు. సామాన్యులకు మాత్రం ఉపశమనం కలిగించే కొన్ని ప్రకటనలు వెలువడే అవకాశముంది.

Budget 2024: పాన్ లేకుండా రూ. 5 లక్షల వరకు బంగారం కొనుగోలు.. బడ్జెట్‌లో కీలక ప్రకటన చేసే ఛాన్స్!
Nirmala Sitharaman On Gold

Updated on: Feb 01, 2024 | 7:38 AM

ఢిల్లీ, ఫిబ్రవరి 1: బడ్జెట్‌ సమర్పణకు మరికొన్ని గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది. దేశ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న తన 6వ, మొదటి మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. అయితే ఈ బడ్జెట్‌లో ఎలాంటి విధానపరమైన నిర్ణయం ఉండకపోవచ్చు. సామాన్యులకు మాత్రం ఉపశమనం కలిగించే కొన్ని ప్రకటనలు వెలువడే అవకాశముంది. మోదీ ప్రభుత్వం బడ్జెట్‌లో బంగారం దిగుమతిపై పన్ను తగ్గించి, పాన్ కార్డు లేకుండా రూ.5 లక్షల వరకు బంగారం కొనుగోలు చేసేందుకు అనుమతి ఇవ్వవచ్చని వార్తలు వస్తున్నాయి. దీన్ని తగ్గించాలని పరిశ్రమ వర్గాలు కూడా చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నాయి. దీనిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.

మధ్యంతర బడ్జెట్‌లో బంగారం దిగుమతులపై బేసిక్ కస్టమ్ డ్యూటీ (బీసీడీ) పెంపును వెనక్కి తీసుకోవాలని డైమండ్స్, ఆభరణాల పరిశ్రమ అభ్యర్థించింది. హేతుబద్ధమైన పన్ను విధానాన్ని అమలు చేయాలని కోరింది. భారతదేశ జిడిపికి ఆభరణాల పరిశ్రమ సుమారు 7 శాతం సహకరిస్తోందని, అందుకే వ్యాపార అనుకూల వాతావరణానికి అర్హులని ఇండస్ట్రీ బాడీ ఆల్ ఇండియా జెమ్ అండ్ జువెలరీ డొమెస్టిక్ కౌన్సిల్ చైర్మన్ సన్యామ్ మెహ్రా అన్నారు. దీంతో ప్రభుత్వానికి కూడా మేలు జరుగుతుందన్నారు. కేంద్ర బడ్జెట్‌లో బంగారంపై పెంచిన బీసీడీని ఉపసంహరించుకోవాలని ఆర్థిక మంత్రిత్వ శాఖను కోరుతున్నామన్నారు. ఇది కాకుండా, హేతుబద్ధమైన పన్ను విధానాన్ని అమలు చేయాలన్నారు.

ప్రస్తుతం 12.5 శాతం బిసిడి యాడ్ వాలోరమ్‌పై విధిస్తున్నారని, దీని వల్ల దిగుమతి చేసుకున్న బంగారంపై మొత్తం పన్ను 18.45 శాతం ఉంటుందని ఆయన చెప్పారు. పెరుగుతున్న బంగారం ధరల కారణంగా పాన్ కార్డు లావాదేవీల పరిమితిని ప్రస్తుతం రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచాలని ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. బంగారం ధర పెంపుతో పాన్ కార్డు లావాదేవీల పరిమితిని రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచాల్సిన అవసరం ఉందని మెహ్రా అన్నారు. దీంతో పాటు రోజువారీ కొనుగోలు పరిమితిని కూడా రూ.లక్షకు పెంచాల్సి ఉంది. ఇది కాకుండా, డైమండ్స్, ఆభరణాల పరిశ్రమకు EMI సౌకర్యాన్ని పునరుద్ధరించాలని GJC సిఫార్సు చేసింది.

మరిన్ని బడ్జెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…