AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వైసీపీని ఆడవాళ్లే తరిమి కొడతారు: యామిని

విజయవాడ: వైసీపీని ఆడవాళ్లు తరిమి కొడతారని టీడీపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని అన్నారు. మహళా దినోత్సవం రోజున ఆమె మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. వైఎస్ జగన్ మహిళా ద్రోహి, ఆయనకు తెలుగు ఆడపడుచులు తగిన గుణపాఠం చెబుతారు. జగన్ కోసం చెంపపెట్టులాంటి సమాధానాన్ని సిద్ధం చేసుకున్నారని సాధినేని యామిని అన్నారు. మడమ తిప్పడంలో ముందున్న పార్టీ వైసీపీ. పక్క రాష్ట్రం నుంచి కేసీఆర్, కేంద్రం నుంచి మోడీతో కలిసి వైసీపీ రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటోందని విమర్శించారు. […]

వైసీపీని ఆడవాళ్లే తరిమి కొడతారు: యామిని
Vijay K
|

Updated on: Mar 08, 2019 | 2:13 PM

Share

విజయవాడ: వైసీపీని ఆడవాళ్లు తరిమి కొడతారని టీడీపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని అన్నారు. మహళా దినోత్సవం రోజున ఆమె మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. వైఎస్ జగన్ మహిళా ద్రోహి, ఆయనకు తెలుగు ఆడపడుచులు తగిన గుణపాఠం చెబుతారు.

జగన్ కోసం చెంపపెట్టులాంటి సమాధానాన్ని సిద్ధం చేసుకున్నారని సాధినేని యామిని అన్నారు. మడమ తిప్పడంలో ముందున్న పార్టీ వైసీపీ. పక్క రాష్ట్రం నుంచి కేసీఆర్, కేంద్రం నుంచి మోడీతో కలిసి వైసీపీ రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటోందని విమర్శించారు.

అద్భుతమైన ‘పసుపు-కుంకుమ’ పథకం ద్వారా లక్షల మంది మహిళల మనసులను చంద్రబాబునాయుడు గెలుచుకున్నారని ఆమె అన్నారు. వారంతా తమ నేతను తిరిగి సీఎంను చేయడం ద్వారా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వబోతున్నారు. మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలను టీడీపీ సర్కారు ప్రవేశపెట్టిందని, మహిళాలోకం మొత్తం చంద్రబాబుకు అండగా ఉందని యామిని అన్నారు.