టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం ప్రారంభమైంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశం మొదలైంది. రాబోయే ఎన్నికలతో పాటు ఎమ్మెల్సీల రాజీనామా వ్యవహారంపై చర్చిస్తున్నారు. దీంతో పాటు ఇతర పార్టీలోకి వలసలపై కూడా చర్చించే అవకాశం ఉంది. మరోవైపు మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు పొలిట్ బ్యూరో సమావేశానికి రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. గత కొంతకాలంగా ఆయన పార్టీపై అసంతృప్తితో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. కిషోర్ చంద్రదేవ్ టీడీపీలో చేరే విషయం తనతో చర్చించలేదని అశోక్ గజపతిరాజు అలకవహించినట్లు తెలుస్తోంది.