పోలవరం ప్రాజెక్టుకు నిధులు విడుద‌ల చేసిన ఏపీ స‌ర్కార్

ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టుకు రూ.1,412కోట్లు రిలీజ్ చేస్తూ...ఏపీ సర్కార్ ఆదివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది.

పోలవరం ప్రాజెక్టుకు నిధులు విడుద‌ల చేసిన ఏపీ స‌ర్కార్

Updated on: Aug 17, 2020 | 10:54 AM

Polavaram Project : ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టుకు రూ.1,412కోట్లు రిలీజ్ చేస్తూ…ఏపీ సర్కార్ ఆదివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో రూ.472 కోట్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొదటి, రెండో, మూడో త్రైమాసికాలకు రిలీజ్ చేసింది. రూ.940 కోట్లను డిస్ట్రిబ్యూటరీలు, కాల్వలు, ప్రాజెక్టు పనులు, పునరావాసం నిమిత్తం విడుదల చేస్తున్న‌ట్లు ఉత్త‌ర్వుల్లో పేర్కొంది.

మ‌రోవైపు పోలవరం ప‌నుల‌ను ఏపీ ప్ర‌భుత్వం వేగ‌వంతం చేసింది. ఇప్పటికే హెడ్ వర్క్స్ కు సంబంధించి చాలావరకు పనులు కంప్లీట్ చెయ్య‌గా, మిగిలిన డిస్డ్రిబ్యూటరీ పనులకు తాజాగా ప్రారంభించింది. దీనికి సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేద‌క‌ రూపకల్పన భాద్యత కాంట్రాక్టర్లకు అప్పగించింది. ఆ రిపోర్ట్‌ ప్రభుత్వానికి అందగానే వ‌ర్క్స్‌ చేపట్టేందుకు రెడీగా ఉంది. ఈ పనులన్నీ సకాలంలో పూర్తిచే సి 2022 కల్లా పోలవరం నీటిని రైతులకు అందించాల‌ని ఏపీ స‌ర్కార్ భావిస్తోంది.

Also Read:

పెరిగిన‌ వరద ఉదృతి : క‌డెం ప్రాజెక్ట్ 5 గేట్లు ఎత్తివేత‌

తెలంగాణ క‌రోనా నేటి బులిటెన్ : జిల్లాల వారీగా కేసులు

Loading...
Unable to load recommendations.
Follow Us