ఒడిశాలో మరోసారి లాక్‌డౌన్

|

Jul 17, 2020 | 5:19 PM

కరోనా రక్కసి ప్రభావం మరింత పెరుగుతుండటంతో ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. క‌రోనా ప్ర‌భావిత ప్రాంతాల్లో లాక్‌డౌన్ విధిస్తున్న‌ట్లు ప్రకటించింది. రాష్ట్రంలో క‌రోనా కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఈ రోజు..

ఒడిశాలో మరోసారి లాక్‌డౌన్
Follow us on

కరోనా రక్కసి ప్రభావం మరింత పెరుగుతుండటంతో ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. క‌రోనా ప్ర‌భావిత ప్రాంతాల్లో లాక్‌డౌన్ విధిస్తున్న‌ట్లు ప్రకటించింది. రాష్ట్రంలో క‌రోనా కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఈ రోజు నుంచి జులై 31 వ‌ర‌కు లాక్‌డౌన్ నిబంధ‌న‌లు అమ‌ల్లో ఉంటాయ‌ని స‌ర్కార్ ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ఒడిశాలోని గంజామ్‌, ఖోర్ధా, క‌ట‌క్‌, జాజ్‌పూర్ జిల్లాల‌తోపాటు రూర్కెలా మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ప్రాంతాల్లో శుక్ర‌వారం రాత్రి 9 గంట‌ల నుంచి పూర్తిస్థాయి లాక్‌డౌన్ నిబంధ‌న‌లు అమ‌ల్లో ఉంటాయ‌ని రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి అసిత్ త్రిపాఠి తెలిపారు.

లాక్‌డౌన్ కట్టడిలో భాగంగా వ్యాపార సంస్థలు ఉదయం 6 గంటల నుంచి మ‌ధ్యాహ్నం 1 గంట‌ల వ‌ర‌కు అనుమ‌తి ఉంద‌న్నారు. అంతేకాకుండా అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి ఈ-కామ‌ర్స్ సేవ‌లకు సైతం అనుమ‌తి ఉంటుంద‌ని ఉత్త‌ర్వులో పేర్కొన్నారు. పూర్తిస్థాయి లాక్‌డౌన్ ఉండ‌నున్న జిల్లాలో ప‌క‌డ్భందీగా ఆంక్ష‌లు పాటించేలా ఇప్ప‌టికే ఆయా జిల్లా ఎస్పీల‌కు ఆదేశాలు జారీ చేశారు.