వాళ్లు అక్కడ లేకపోతే మనమిక్కడ ఉండేవాళ్లం కాదు

| Edited By: Team Veegam

Feb 14, 2020 | 1:26 PM

జమ్మూకాశ్మీర్లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిని భారతదేశ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. దేశం మొత్తం పాకిస్తాన్ పై ఎప్పుడు పగ తీర్చుకోవాలా అని ఎదురుచూస్తుంది. భారతదేశానికి అండగా నిలుస్తామని అగ్ర రాజ్యలు ఇప్పటికే పిలుపునిచ్చాయి. ప్రధాని మోడీ కూడా స్వయంగా చర్యలు తీసుకుంటామని తెలపడంతో మరో సర్జికల్ స్ట్రైక్ కి దారి తీసే అవకాశాలు ఉన్నాయని సమాచారం. అయితే.. దేశమే ఇలా ఉంటే ఇక జవాన్ల కుటుంబాలు ఇంకా శోక సంద్రంలో మునిగిపోయారు. జవాన్ల కుటుంబాలను ఆదుకొనేందుకు భారతదేశం ముందుకొస్తోంది. […]

వాళ్లు అక్కడ లేకపోతే మనమిక్కడ ఉండేవాళ్లం కాదు
Follow us on

జమ్మూకాశ్మీర్లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిని భారతదేశ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. దేశం మొత్తం పాకిస్తాన్ పై ఎప్పుడు పగ తీర్చుకోవాలా అని ఎదురుచూస్తుంది. భారతదేశానికి అండగా నిలుస్తామని అగ్ర రాజ్యలు ఇప్పటికే పిలుపునిచ్చాయి. ప్రధాని మోడీ కూడా స్వయంగా చర్యలు తీసుకుంటామని తెలపడంతో మరో సర్జికల్ స్ట్రైక్ కి దారి తీసే అవకాశాలు ఉన్నాయని సమాచారం. అయితే.. దేశమే ఇలా ఉంటే ఇక జవాన్ల కుటుంబాలు ఇంకా శోక సంద్రంలో మునిగిపోయారు. జవాన్ల కుటుంబాలను ఆదుకొనేందుకు భారతదేశం ముందుకొస్తోంది. అమరుల కుటుంబాలని ఆదుకునే దిశగా దేశ నాయకులంతా తమ కృషికి తగ్గ విరాళాలు అందిస్తున్నారు.

ఇదే నేపథ్యంలో టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కూడా ఆర్థిక సహాయం ప్రకటించారు. సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా అమర జవాన్లకు ఆర్థిక సహాయం అందించారు. ఆదివారం నగరంలో ఉన్న సీఆర్పీఎఫ్ సౌత్ ఆఫీసుకు కేటీఆర్ చేరుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన అమరులైన వీర జవాన్లకు కేటీఆర్ నివాళులర్పించారు. జవాన్ల గౌరవార్థం తన వంతుగా రూ. 25 లక్షలు, స్నేహితులు ముందుకొచ్చి ఇచ్చిన మరో రూ. 25 లక్షలు అందిస్తున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని కేటీఆర్ ట్విట్టర్ ద్వారా తెలిపారు.