యూపీ మాజీ ఆరోగ్య మంత్రి కరోనాతో మృతి

|

Jul 16, 2020 | 5:33 PM

కరోనా వైరస్ కరాళనృతానికి దేశం విలవిలలాడుతోంది. సామాన్యుడి నుంచి ప్రముఖుల దాకా కొవిడ్ బారినపడుతున్నారు. కరోనాను జయించి కొందరు ఇళ్లకు చేరుకుంటుంటే, మరికొందరు రాకాసి కాటు బలవుతున్నారు. తాజా ఉత్తరప్రదేశ్ మాజీ మంత్రి, సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నేత ఘూరా రామ్ ప్రాణాలు కోల్పోయారు. కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీలో చికిత్స పొందుతున్న ఆయన గురువారం మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు.

యూపీ మాజీ ఆరోగ్య మంత్రి కరోనాతో మృతి
Follow us on

కరోనా వైరస్ కరాళనృతానికి దేశం విలవిలలాడుతోంది. సామాన్యుడి నుంచి ప్రముఖుల దాకా కొవిడ్ బారినపడుతున్నారు. కరోనాను జయించి కొందరు ఇళ్లకు చేరుకుంటుంటే, మరికొందరు రాకాసి కాటు బలవుతున్నారు. తాజా ఉత్తరప్రదేశ్ మాజీ మంత్రి, సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నేత ఘూరా రామ్ ప్రాణాలు కోల్పోయారు. కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీలో చికిత్స పొందుతున్న ఆయన గురువారం మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు. గత మంగళవారం దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు రావడంతో రామ్‌ను ఆస్పత్రిలో చేర్చినట్టు ఆయన కుమారుడు సంతోష్ కుమార్ వెల్లడించారు. దీంతో అతనికి వైద్య పరీక్షలు నిర్వహించడంతో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. నిన్న వెలువడిన వైద్య పరీక్షల్లో తన తండ్రికి కొవిడ్-19 సోకినట్టు తేలిందనీ.. సాయంత్రానికల్లా ఆయన ఆరోగ్యం మరింత క్షీణించిందని సంతోష్ తెలిపారు.

బీఎస్పీ వ్యవస్థాపకుడు కాన్షీరాంకు అత్యంత విశ్వాసపాత్రుడైన ఘూరా రామ్.. 1993, 2002, 2007 ఎన్నికల్లో రాస్రా అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మాయావతి ప్రభుత్వంలో రాష్ట్ర ఆరోగ్యమంత్రిగా పనిచేశారు. ఇటీవల సమాజ్‌వాదీ పార్టీలో చేరిన ఆయన… ఆ పార్టీ జాతీయ వర్కింగ్ కమిటీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. పార్టీలో సీనియర్ నేత కొవిడ్ తో మృతి చెందడంపట్ల ఆ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు.