తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ధరణి పోర్టల్ను సీఎం కేసీఆర్ ప్రారంభిస్తున్నారు. ముందుగా భగవంతునికి పూజలు జరిపి వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య దేవుని ఆశీస్సులు కేసీఆర్ అందుకున్నారు. సీఎంతోపాటు, సీఎస్, మంత్రులు, ఇతర అధికారులు పూజా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లిలో ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగుతోంది. ప్రత్యక్ష ప్రసారం ఈ దిగువున చూడొచ్చు.