వైసీపీలో చేరిన సహజనటి

| Edited By: Team Veegam

Feb 14, 2020 | 1:53 PM

హైదరాబాద్: ప్రముఖ సినీ నటి జయసుధ వైసీపీలో జాయిన్ అయ్యారు. గురువారం సాయంత్రం లోటస్ పాండ్‌లో వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌ను కలసిన ఆమె వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. జగన్ పార్టీ కండువా కప్పి జయసుధను సాదరంగా పార్టీలోకి ఆహ్వనించారు. ఈ సందర్భంగా వచ్చే ఎలక్షన్స్‌లో జగన్ సిఎం కావడం కాయమని జయసుధ జోస్యం చెప్పారు. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో జయసుధ 2009 ఎన్నికల్లో సికింద్రాబాద్ అసెంబ్లీ స్థానం నుండి  కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసి  విజయం […]

వైసీపీలో చేరిన సహజనటి
Follow us on

హైదరాబాద్: ప్రముఖ సినీ నటి జయసుధ వైసీపీలో జాయిన్ అయ్యారు. గురువారం సాయంత్రం లోటస్ పాండ్‌లో వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌ను కలసిన ఆమె వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. జగన్ పార్టీ కండువా కప్పి జయసుధను సాదరంగా పార్టీలోకి ఆహ్వనించారు. ఈ సందర్భంగా వచ్చే ఎలక్షన్స్‌లో జగన్ సిఎం కావడం కాయమని జయసుధ జోస్యం చెప్పారు.

ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో జయసుధ 2009 ఎన్నికల్లో సికింద్రాబాద్ అసెంబ్లీ స్థానం నుండి  కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసి  విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో జయసుధకు టిక్కెట్టు దక్కడంలో  అప్పటి సీఎం వైఎస్ఆర్ కీలకపాత్ర పోషించారు. కానీ 2014 ఎన్నికల్లో మాత్రం ఆవిడకు ఓటమి తప్పలేదు.

ఆ తర్వాత ఆమె కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఏడాది క్రితం జయసుధ టీడీపీలో చేరారు. ఆ తర్వాత సినిమాలతో బిజీగా ఉంటూ టీడీపీ కార్యక్రమాల్లో ఆమె ఎప్పుడూ క్రియాశీలకంగా పాల్గొనలేదు.