హైదరాబాద్‌లో గాలి పీలుస్తున్నారా..? జాగ్రత్త!

|

Feb 18, 2019 | 8:23 PM

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో కోటి మంది జనాభా నివసిస్తున్నారు. ప్రతి రోజూ 50 లక్షలకు పైగా వాహనాలు తిరుగుతుంటాయి. దీనికి తోడు రోజూ వెయ్యికి పైగా కొత్త వాహనాలు జత కలుస్తుంటాయి. మరి పరిస్థితి ఈ రేంజ్‌లో ఉంటే ఇక కాలుష్యం పెరగకుండా ఉంటుందా? అవును పెరుగుతోంది. రోజు రోజుకూ ఈ పరిస్థితి ప్రమాదకరంగా మారుతోందట. దక్షిణాది రాష్ట్రాల్లో కాలుష్యపరంగా అత్యంత ప్రమాదకరంగా ఉన్న నగరం హైదరాబాదేనట. ఇక్కడి గాలి పీలిస్తే ఆస్తమా, ఉపరితిత్తులు, […]

హైదరాబాద్‌లో గాలి పీలుస్తున్నారా..? జాగ్రత్త!
Follow us on

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో కోటి మంది జనాభా నివసిస్తున్నారు. ప్రతి రోజూ 50 లక్షలకు పైగా వాహనాలు తిరుగుతుంటాయి. దీనికి తోడు రోజూ వెయ్యికి పైగా కొత్త వాహనాలు జత కలుస్తుంటాయి. మరి పరిస్థితి ఈ రేంజ్‌లో ఉంటే ఇక కాలుష్యం పెరగకుండా ఉంటుందా? అవును పెరుగుతోంది. రోజు రోజుకూ ఈ పరిస్థితి ప్రమాదకరంగా మారుతోందట. దక్షిణాది రాష్ట్రాల్లో కాలుష్యపరంగా అత్యంత ప్రమాదకరంగా ఉన్న నగరం హైదరాబాదేనట.

ఇక్కడి గాలి పీలిస్తే ఆస్తమా, ఉపరితిత్తులు, గెండె సంబంధిత ఇబ్బందులు తలెత్తే అవకాశం ఎక్కువగా ఉందంటున్నారు నిపుణులు. తాజాగా సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ విడుదల చేసిన బులిటెన్‌లో దక్షిణాది రాష్ట్రాల్లో కాలుష్యపరంగా హైదరాబాద్ టాప్‌లో ఉన్నట్టు తేలింది. దీనిపై తెలంగాణ రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ స్పందిస్తూ నగర జనాభాతో పాటు పెరుగుతున్న ట్రాఫిక్ కారణంగా కాలుష్యం బాగా పెరుగుతుందని అంటోంది. ఈ పొల్యూషన్ కంట్రోల్‌కు తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నగర ప్రజలు కోరుతున్నారు.