శ్రీనగర్ : జమ్మూకశ్మీర్లోని ఉద్ధంపూర్ జిల్లాలో ఘోర ప్రమాదం సంభవించింది. మజాల్తా వద్ద ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. శుక్రవారం రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. మరో 38మంది తీవ్రంగా గాయపడ్డారు. సురిన్సార్ నుంచి శ్రీనగర్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రులకు తరలిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.