కీలక బిల్లులకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్
ఏపీ అసెంబ్లీ ఆమోదించిన కీలక బిల్లులకు చట్టబద్ధత కల్పిస్తూ.. ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. శాసనసభ ఆమోదించిన 11 బిల్లులకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదం తెలిపారు. కాంట్రాక్ట్ పనుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లు, కాంట్రాక్టుల్లో మహిళలకు 50శాతం రిజర్వేషన్ల బిల్లు, ఉద్యోగాల్లో స్థానికులకు 75 శాతం రిజర్వేషన్ల బిల్లు, కౌలు రైతుల హక్కుల బిల్లు వంటి మొత్తం పదకొండు బిల్లులకు గవర్నర్ ఆమోద ముద్ర వేశారు.
ఏపీ అసెంబ్లీ ఆమోదించిన కీలక బిల్లులకు చట్టబద్ధత కల్పిస్తూ.. ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. శాసనసభ ఆమోదించిన 11 బిల్లులకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదం తెలిపారు. కాంట్రాక్ట్ పనుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లు, కాంట్రాక్టుల్లో మహిళలకు 50శాతం రిజర్వేషన్ల బిల్లు, ఉద్యోగాల్లో స్థానికులకు 75 శాతం రిజర్వేషన్ల బిల్లు, కౌలు రైతుల హక్కుల బిల్లు వంటి మొత్తం పదకొండు బిల్లులకు గవర్నర్ ఆమోద ముద్ర వేశారు.