నడిరోడ్డుపై యువకుల హల్‌చల్.. కానిస్టేబుల్ పై దాడి!

| Edited By: Srinu

Nov 22, 2019 | 4:38 PM

తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో పోలీసులపైనే దాడి చేశారు కొందరు యువకులు. సీతానగరం కోరుకొండ స్పెషల్ బ్రాంచ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న నాగేశ్వర్ ను ముగ్గురు యువకులు కలిసి నడిరోడ్డుపైనే అందరు చూస్తుండగా చితకబాదారు. ఆనంద్ నగర్ బస్టాండ్ దగ్గర కానిస్టేబుల్ నాగేశ్వర్ బైక్ ను యువకులు వెనకనుంచి ఢీకొట్టారు. బైక్ ను ఢీకొట్టి వెళుతున్నారని ఆ కానిస్టేబుల్ ఫోటో తీశాడు. దీంతో కోపోద్రిక్తులయిన ఆ యువకులు నాగేశ్వర్ పై దాడి చేసి చితకబాదారు. దీంతో స్థానికులు భయభ్రాంతులయ్యారు. […]

నడిరోడ్డుపై యువకుల హల్‌చల్.. కానిస్టేబుల్ పై దాడి!
Follow us on

తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో పోలీసులపైనే దాడి చేశారు కొందరు యువకులు. సీతానగరం కోరుకొండ స్పెషల్ బ్రాంచ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న నాగేశ్వర్ ను ముగ్గురు యువకులు కలిసి నడిరోడ్డుపైనే అందరు చూస్తుండగా చితకబాదారు. ఆనంద్ నగర్ బస్టాండ్ దగ్గర కానిస్టేబుల్ నాగేశ్వర్ బైక్ ను యువకులు వెనకనుంచి ఢీకొట్టారు. బైక్ ను ఢీకొట్టి వెళుతున్నారని ఆ కానిస్టేబుల్ ఫోటో తీశాడు. దీంతో కోపోద్రిక్తులయిన ఆ యువకులు నాగేశ్వర్ పై దాడి చేసి చితకబాదారు. దీంతో స్థానికులు భయభ్రాంతులయ్యారు. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది. ముగ్గురు యువకుల్లో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. మిగిలినవారికోసం గాలిస్తున్నారు త్రీ టౌన్ పోలీసులు. అటువైపుగా వెళుతున్నవారు మొబైల్ లో రికార్డ్ చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.