
మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రాంగణంలో 58లక్షల రూపాయలతో నిర్మించిన సఖి కేంద్ర భవనాన్ని మంత్రి శ్రీనివాసగౌడ్ ప్రారంభించారు. మహిళలు రాజకీయాల్లో రాణిస్తేనే మహిళా సాధికారిత సాధ్యమవుతుందన్నారు మంత్రి. ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ.. మహిళలపై దాడులు జరగడం దారుణమన్నారు. మహిళలపై దాడుల్ని నివారించేందుకే సఖి కేంద్రాన్ని ప్రారంభించినట్లు మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. మహిళలపై హింసాత్మక చర్యలకు దిగితే బాధిత మహిళలు 181 టోల్ ఫ్రీ నెంబర్కు ఫోన్ చేయాలని మంత్రి సూచించారు. సఖి కేంద్రంలో మహిళలకు అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు మంత్రి శ్రీనివాస్గౌడ్.