రమణదీక్షితులు మరో సంచలన ట్వీట్‌

| Edited By:

Aug 22, 2020 | 7:07 PM

టీటీడీ గౌరవ ప్రధానార్చకులు రమణ దీక్షితులు మరో సంచలన ట్వీట్ చేశారు. తనను బాధ్యతలు చేపట్టమని జగన్‌ ఆదేశించినా

రమణదీక్షితులు మరో సంచలన ట్వీట్‌
Follow us on

Ramana Deekshitulu Tweet: టీటీడీ గౌరవ ప్రధానార్చకులు రమణ దీక్షితులు మరో సంచలన ట్వీట్ చేశారు. తనను బాధ్యతలు చేపట్టమని జగన్‌ ఆదేశించినా.. టీటీడీ తనను గౌరవ ప్రధానార్చకుడిగా మాత్రమే ప్రతిపాదించిందని ఆయన వెల్లడించారు.

వైఎస్‌ జగన్ గారు నన్ను వంశపారంపర్య అర్చుకుడిగా బాధ్యతలు చేపట్టమన్నారు. కానీ టీటీడీ మాత్రం ముఖ్యమంత్రి ఆదేశాలను పట్టించుకోకుండా నన్ను గౌరవ ప్రధానార్చకుడి పదవిని ఇచ్చింది. దీన్ని నేను తిరస్కరించాను. సీఎం గారు దీనిపై మీరు ఆదేశాలు జారీ చేయండి. అర్చకులు ఎదురుచూస్తున్నారు అని రమణ దీక్షితులు ట్వీట్ చేశారు. అయితే కాసేపటికే ఆయన మళ్లీ ఆ ట్వీట్‌ని డిలీట్ చేయడం గమనర్హం. కాగా టీటీడీ పనితీరుపై విమర్శలు చేసిన నేపథ్యంలో రెండేళ్ల క్రితం రమణ దీక్షితులుపై వేటు పడిన విషయం తెలిసిందే. అయితే జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత ఆయనను మళ్లీ ప్రధానార్చకులుగా టీటీడీ నియమించింది. కానీ తనకు వారసత్వ అర్చక పదవి కావాలని రమణ దీక్షితులు కోరుతున్నారు. ఈ క్రమంలో టీటీడీపై ఆ మధ్యన కూడా రమణ దీక్షితులు పలు ట్వీట్లు చేశారు.

Read More:

హెచ్‌1బీ వీసా కుంభకోణం: అమెరికాలో భారతీయుడి అరెస్ట్‌

మెగాస్టార్‌ బర్త్‌డే.. మెగా ఫ్యాన్స్‌కి సుస్మిత స్పెషల్ గిఫ్ట్‌