అదుపుతప్పి ఇంట్లోకి దూసుకెళ్లిన ట్రావెల్స్ బస్సు.. పలువురికి గాయాలు

|

Sep 12, 2020 | 12:17 PM

ఖమ్మం జిల్లాలో ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బీభత్సం స‌ృష్టించింది. అదుపు తప్పి రహదారి పక్కనే ఉన్న ఓ ఇంట్లోకి దూసుకెళ్లింది.

అదుపుతప్పి ఇంట్లోకి దూసుకెళ్లిన ట్రావెల్స్ బస్సు.. పలువురికి గాయాలు
Follow us on

ఖమ్మం జిల్లాలో ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బీభత్సం స‌ృష్టించింది. అదుపు తప్పి రహదారి పక్కనే ఉన్న ఓ ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటన ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో శనివారం తెల్లవారుజామున జరిగింది.

ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నాటకన్‌ గూడెంలో ఓ ప్రైవేటు బస్సు అదుపుతప్పింది. రహదారి పక్కనే ఉన్న ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇంట్లో నిద్రిస్తున్న కృష్ణారెడ్డి, ఆయన సతీమణి వెంకటమ్మ స్వల్పంగా గాయపడ్డారు. స్థానికుల సహాకారంతో క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా, బస్సులో ప్రయాణిస్తున్న 20 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ప్రైవేటు సూపర్ లగ్జరీ బస్సు ఖమ్మం నుంచి హైదరాబాద్‌కు వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లుగా ప్రయాణికులు తెలిపారు. నిద్రమత్తు, డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా రెండు ఇళ్లు, కూలిపోయాయి. ఇద్దరు వ్యక్తులకు తీవ్రగాయాలు అయ్యాయి. బస్సు ఒడిశా నుంచి హైదరాబాద్ వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. బస్సులోని ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.