ఖైదీలకు సెంట్రల్ జైలులోనే చికిత్స.. ప్రభుత్వం చర్యలు
రాజహేంద్రవరం సెంట్రల్ జైలులో పాజిటివ్గా నిర్ధారణ అయిన 252 మంది ఖైదీలకు అక్కడే చికిత్స అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
Rajamahendravaram Central Jail: రాజహేంద్రవరం సెంట్రల్ జైలులో పాజిటివ్గా నిర్ధారణ అయిన 252 మంది ఖైదీలకు అక్కడే చికిత్స అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకు సంబంధించిన మెడికల్ కిట్లను ప్రభుత్వం సమకూర్చింది. జైలులో ఉన్న వైద్యుడితో పాటు బయటి నుంచి డాక్టర్లను పంపి, చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేశారు. అంతేకాదు కరోనా సోకిన ఖైదీలకు మెనూలో మార్పులు చేశారు. పౌష్టికాహారంగా ప్రతిరోజు గుడ్డు, పాలు, పప్పు, ఆకు కూరలు, పెరుగు తదితర వాటిని మెనూలో చేర్చారు.
అయితే సెంట్రల్ జైలులో మొత్తం 1,700 మంది ఖైదీలు ఉండగా, వారిలో దాదాపుగా 1500 మందికి కరోనా పరీక్షలు చేశారు. మరో 200 మందికి పరీక్షలు నిర్వహించాలని, అలాగే కొందరి ఫలితాలు రావాలని డిప్యూటీ డీఎంఅండ్హెచ్ఓ డాక్టర్ కోమల తెలిపారు. పాజిటివ్ వచ్చిన ఖైదీలను ప్రత్యేక బ్యారక్లో ఐసోలేషన్లో ఉంచామని ఆమె పేర్కొన్నారు. సీరియస్గా ఉన్న ఖైదీలను ప్రభుత్వాస్పత్రికి తరలించి వైద్య సేవలు అందించేందుకు ఏర్పాట్లు చేశామని కోమల వివరించారు. సెంట్రల్ జైల్లో పాజిటివ్ వచ్చిన ఖైదీల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ప్రతిరోజు వారికి కౌన్సెలింగ్ ఇస్తున్నామని తెలిపారు. కాగా సెంట్రల్ జైలులో పనిచేసే ఓ డాక్టర్కి కూడా కరోనా సోకినట్లు కమలా వెల్లడించారు.
Read This Story Also: Bigg Boss 4: ‘బిగ్బాస్ 4’ ప్రారంభం అయ్యేది అప్పుడేనా!