ఏపీలో వారంలోపే బియ్యం కార్డుల్లో పేర్లు

| Edited By:

Aug 17, 2020 | 10:17 AM

ఏపీలో దరఖాస్తు చేసిన వారంలోపే బియ్యం కార్డులో పేర్లు నమోదు అవుతున్నాయి. దీంతో లబ్ధిదారులు ఊపిరి పీల్చుకుంటున్నారు.

ఏపీలో వారంలోపే బియ్యం కార్డుల్లో పేర్లు
Follow us on

Names in Rice Cards: ఏపీలో దరఖాస్తు చేసిన వారంలోపే బియ్యం కార్డులో పేర్లు నమోదు అవుతున్నాయి. దీంతో లబ్ధిదారులు ఊపిరి పీల్చుకుంటున్నారు. పేర్లు నమోదు చేసుకునేందుకు గతంలో కార్డుదారులు ఇబ్బందులు ఎదుర్కొనేటప్పటికీ.. ప్రస్తుతం వారంలోగానే పేర్లు నమోదు అయ్యేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో గత నాలుగు నెలల్లో కొత్తగా 11.88 లక్షల మంది పేర్లు బియ్యం కార్డుల్లో నమోదు అయ్యాయి.

వీటికి సంబంధించి గతంలో మీసేవా కేంద్రాలకు వెళ్లి దరఖాస్తు చేసుకుంటుండగా.. ఇప్పుడు గ్రామ సచివాలయాల్లోనే దరఖాస్తు చేసుకునేందుకు వీలును కల్పించారు. లేదంటే గ్రామ వాలంటీర్‌ వద్దనే సంబంధిత వివరాలను ఇచ్చి నమోదు చేసుకుంటున్నారు. కొత్తగా పేర్లు పెరుగుతుండటంతో ప్రతి నెలా సరకులు తీసుకునే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. కాగా కరోనా నేపథ్యంలో ఒక్కో సభ్యుడికి నెలకు 10 కిలోల బియ్యం, కుటుంబానికి కిలో కందిపప్పు ఉచితంగా ఇస్తోన్న విషయం తెలిసిందే.

Read More:

సొంత బ్యాంక్‌ ఏర్పాటు చేయనున్న నిత్యానంద

ఏపీ ప్రభుత్వంపై కఠిన చర్యలు తీసుకోండి: ప్రధానికి బాబు లేఖ