అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. ఇక విమానంలో ఇరుముడికి నో కండిషన్స్.. కేంద్రమంత్రి రామ్మోహన్‌ నాయుడు కీలక ప్రకటన..

విశాఖపట్నం - విజయవాడ మధ్య రెండు కొత్త విమాన సేవలు ప్రారంభమయ్యాయి.. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఈ సేవలను విశాఖపట్నంలో ప్రారంభించారు. ముఖ్యంగా అయ్యప్ప భక్తులకు శుభవార్తని అందించారు. ఇరుముడిని విమానంలో తీసుకెళ్ళడానికి అనుమతి ఇస్తున్నట్లు తెలిపారు. జనవరి 20 వరకు ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుందన్నారు.

అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. ఇక విమానంలో ఇరుముడికి నో కండిషన్స్.. కేంద్రమంత్రి రామ్మోహన్‌ నాయుడు కీలక ప్రకటన..
Kinjarapu Rammohan Naidu

Updated on: Oct 27, 2024 | 11:20 AM

విశాఖ- విజయవాడ మధ్య మరోరెండు కొత్త విమాన సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. విశాఖ విమానాశ్రయంలో ఎయిర్‌ఇండియా ఎక్స్‌ప్రెస్‌ విమాన సర్వీసును కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడు ప్రారంభించారు. కొత్త సర్వీసులతో విశాఖ- విజయవాడ మధ్య తిరిగే సర్వీసులు మూడుకు చేరింది. ఈ కార్యక్రమంలో ఎంపీ గొల్ల బాబురావు, ఎమ్మెల్యే గణబాబు హాజరయ్యారు. ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ సర్వీసు ఉదయం 9:35 గంటలకు విశాఖలో బయలుదేరి 10:35కు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటోంది. తిరిగి రాత్రి 7:55కు విజయవాడలో బయలుదేరి 9 గంటలకు విశాఖ వెళ్తుంది. ఇండిగో సర్వీసు రాత్రి 7:15కు విజయవాడలో బయలుదేరి 8:20కి విశాఖ చేరుతుంది. అదే సర్వీసు తిరిగి రాత్రి 8:45కు విశాఖలో బయలుదేరి 9:50కి విజయవాడ చేరుతుంది.

అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్..

విశాఖ-విజయవాడ మధ్య మరో రెండు విమాన సర్వీసులు ప్రారంభించిన అనంతరం కేంద్రమంత్రి రామ్మోహన్‌ నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. మరిన్ని సర్వీసులను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ చెప్పారు. ఇరుముడితో విమానంలో ప్రయాణించేందుకు అనుమతినిస్తున్నట్లు తెలిపారు. జనవరి 20 వరకు అయ్యప్ప భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. వచ్చే ఏడాది జనవరి 20 వరకు ఈ నిబంధన ఉంటుదన్నారు. ఇప్పటి వరకూ భద్రతా కారణాల రీత్యా ఇరుముడిని వెంట తీసుకెళ్లనివ్వలేదు అధికారులు.. ఇరుముడిని చెకిన్‌ బ్యాగేజీలో కాకుండా తమ వెంట తీసుకెళ్లవచ్చంటూ కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు శుభవార్త చెప్పారు.

వీడియో చూడండి..

Loading...
Unable to load recommendations.
Follow Us