ఏపీలో ‘ఇంటింటికీ బియ్యం’.. సిద్ధమైన వాహనాలు

| Edited By:

Aug 14, 2020 | 11:09 AM

ఏపీలో త్వరలో చేపట్టబోతున్న ఇంటింటా నాణ్యమైన బియ్యం పంపిణీకి సంబంధించిన ఏర్పాట్లు మొదలయ్యాయి. రేషన్ షాపుల వారీగా అధికారులు రూట్‌ మ్యాప్‌ని సిద్ధం చేశారు

ఏపీలో ఇంటింటికీ బియ్యం.. సిద్ధమైన వాహనాలు
Follow us on

Andhra Pradesh Ration distribution: ఏపీలో త్వరలో చేపట్టబోతున్న ఇంటింటా నాణ్యమైన బియ్యం పంపిణీకి సంబంధించిన ఏర్పాట్లు మొదలయ్యాయి. రేషన్ షాపుల వారీగా అధికారులు రూట్‌ మ్యాప్‌ని సిద్ధం చేశారు. దీనికి సంబంధించి అవసరమైన మేరకు మరిన్ని చర్యలు తీసుకునేందుకు క్షేత్రస్థాయిలో సమీక్షలు నిర్వహించాలని ఉన్నతాధికారులు, జిల్లా అధికారులను ఆదేశించారు. బియ్యం పంపిణీకి గ్రామీణ ప్రాంతాల్లో పెద్దగా ఇబ్బందులు ఏర్పడే అవకాశం లేకపోయినప్పటికీ.. పట్టణ ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. అధిక మొత్తంలో బియ్యం తీసుకువెళ్లేందుకు వీలుగా నాలుగు చక్రాల వాహనాలు వినియోగించాలని అధికారులు నిర్ణయించారు. రాష్ట్రంలో మొత్తం 29,784 రేషన్‌ షాపులు ఉండగా..  1,50,15,765 బియ్యం కార్డులు ఉన్నాయి. వాటి ఆధారంగా మ్యాప్‌ని సిద్ధం చేశారు. కాగా ఇంటింటా నాణ్యమైన బియ్యం పంపిణీకి సంబంధించి శ్రీకాకుళం జిల్లాలో పైలట్‌ ప్రాజెక్టును చేపట్టగా.. అది విజయవంతమైన విషయం తెలిసిందే.

బియ్యం ఎలా పంపిణీ చేయనున్నారంటే:

1.గ్రామాలు, పట్టణాల వివరాలను విడివిడిగా తయారు చేశారు.

2. ప్రతి రెండు వేల కార్డులకు ఒక వాహనాన్ని ఏర్పాటు చేసి ఇంటింటికి వెళ్లి లబ్దిదారుల ఎదుటే తూకం వేసి బియ్యాన్ని పంపిణీ చేయనున్నారు.

3. ప్రతి నెలా 1 నుంచి 15వ తేదీ లోపు బియ్యాన్ని పంపిణీ చేయనున్నారు.

4.బియ్యం తీసుకునేందకు వీలుగా లబ్దిదారులకు ఉచితంగా బ్యాగు అందివ్వనున్నారు.

5. మార్గమధ్యలో బియ్యం కల్తీ చేసే అవకాశం లేకుండా గోదాముల నుంచి వచ్చే ప్రతి బ్యాగుపై స్ట్రిప్ సీల్ వేయనున్నారు.

6.ప్రతి బ్యాగ్‌పై బార్ కోడ్ కూడా ఉండనుంది.

7. వాహనంలోనే ఎలక్ట్రానిక్ వేయింగ్ మెషీన్ ఉంటుంది.

Read More:

సుశాంత్ మృతి: మరిన్ని అనుమానాలు వ్యక్తం చేసిన సుబ్రహ్మణ్య స్వామి

పవన్‌ గైర్హాజరు.. మళ్లీ అనుమానాలు