స్కూళ్లకు సంబంధించి జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయం

| Edited By:

Sep 15, 2020 | 2:54 PM

స్కూళ్లకు సంబంధించి జగన్ సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాదికి 45వేల ప్రభుత్వ స్కూళ్లను డిజిటలైజ్ చేయాలని

స్కూళ్లకు సంబంధించి జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయం
Follow us on

AP Government Schools: స్కూళ్లకు సంబంధించి జగన్ సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాదికి 45వేల ప్రభుత్వ స్కూళ్లను డిజిటలైజ్ చేయాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆలోచిస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ స్కూళ్లలో పలు సంస్కరణల కోసం సీఎం అధికారులకు డెడ్‌లైన్ విధించారని, అందుకోసం అధికారులు రాత్రింబవళ్లు కష్టపడుతున్నారని ఆదిమూలపు సురేష్‌ చెప్పారు. డిజిటలైజేషన్‌లో ప్రైవేట్ స్కూళ్లతో ప్రభుత్వ పాఠశాలలు పోటీ పడబోతున్నాయని మంత్రి తెలిపారు.

మొదటి దశలో భాగంగా 10వేల స్టార్ట్‌ టీవీలను స్కూళ్లలో అమర్చనున్నట్లు ఆయన వివరించారు. ఇందుకోసం రూ.45 నుంచి రూ.50కోట్లు ఖర్చు చేయబోతున్నట్లు మంత్రి వెల్లడించారు. కాగా ఇటీవల క్యాంపు ఆఫీసులో రివ్యూ మీటింగ్‌లో మాట్లాడిన జగన్‌.. డిజిటల్‌ విద్యను ప్రోత్సహించేలా ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని సదుపాయాలను కల్పించాలని, ప్రభుత్వ పాఠశాలల వైపు పిల్లలు, తల్లిదండ్రులు చూసేలా మార్పులు చేయాలని అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే.

Read More:

ఇలా జరగడం శ్రీవారి ఆలయ చరిత్రలో తొలిసారి: ప్రధానార్చకులు

నెల రోజుల పోరాటం.. కరోనాతో కన్నుమూసిన ఎయిమ్స్ మాజీ విద్యార్థి