ఏపీలో ఎంసెట్ సహా అన్ని రకాల కామన్ ఎంట్రన్స్ పరీక్షలు వాయిదా పడ్డాయి. రాష్ట్రంలో రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో ఎంసెట్, ఈసెట్, ఐసెట్ సహా 8 సెట్ల పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. కరోనా తీవ్రత తగ్గిన తరువాత సెప్టెంబర్ మూడో వారంలో ఎంసెట్ నిర్వహిస్తామని, దీనికి సంబంధించిన పరీక్షా తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని పేర్కొన్నారు. జాతీయ ఎంట్రన్స్ పరీక్షలకు ఆటంకం కలగకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. సమస్యలను పరిష్కరించేందుకు రెగ్యులేషన్ మానిటరింగ్ కమిటీ పనిచేస్తోందని. ఆన్లైన్ కోర్సుల విధివిధానాలను త్వరలోనే రూపొందిస్తామని మంత్రి పేర్కొన్నారు.