
Visakhapatnam–Bhogapuram Aero Express Buses: విశాఖ- భోగాపురం ఎయిరో ఎక్స్ప్రెస్ బస్సులు ప్రారంభం అయ్యాయి. ఎయిర్ ట్రావెలర్స్ కోసం రెండు రూట్లలో బస్సుల రాకపోకలు సాగిస్తున్నాయి. అయితే తొలి విడతగా 20 బస్సులను అందుబాటులోకి తెచ్చిన ప్రభుత్వం .. ఈవీ ఏసీ బస్సులలో ప్రత్యేక సౌకర్యాలు ఉన్నాయి. అత్యాధునిక సౌకర్యాలతో ఎయిరో ఎక్స్ప్రెస్ బస్సులు ఉన్నాయి. ఈ బస్సులు 12 మీటర్ల పొడవుతో 35 సీటింగ్ కెపాసిటీ కలిగి ఉన్నాయి. ఈ బస్సులు రెండు రూట్లలో విశాఖ భోగాపురం మధ్య రాకపోకలు సాగిస్తున్నాయి.
ఒక రూటులో 10 బస్సులు.. గాజువాక నుంచి ఎన్ ఏ డీ , మద్దిలపాలెం హైవే మీదుగా భోగాపురం, మరో రూట్లో 10 బస్సులు.. రైల్వే స్టేషన్, బస్ స్టేషన్, బీచ్ రోడ్, ఐటీ పార్క్ మీదుగా భోగాపురానికి వెళ్తాయి .విమానాశ్రయానికి ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి 300, గాజువాక నుంచి 400 రూపాయలు టికెట్ ధర నిర్ణయించారు అధికారులు.
బస్సులో ప్రయాణించే వికలాంగులు, వృద్ధుల కోసం ప్రత్యేక సౌకర్యం కల్పించారు. హైడ్రాలిక్ వీల్ చైర్ తో బస్సు ఎక్కి దిగే సదుపాయం కల్పించారు. భద్రతాపరంగా ప్రత్యేక ఏర్పాట్లు బస్సులో ఉన్నాయి. సీసీ కెమెరాలు, ఎమర్జెన్సీ ఎగ్జిట్లతో పాటు హేమర్లు, ఫైర్ ఎస్టింగ్ విష్ కూడా అందుబాటులో ఉన్నాయి. మంచి నైపుణ్యం ఉన్న సిబ్బందిని విధుల్లోకి తీసుకున్నారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి