KV Krishna Rao: పాకిస్తాన్ కంటి మీద కునుకు లేకుండా చేసిన తెలుగు వీరుడు కేవీ కృష్ణారావు..భారత సైన్యపు ఆత్మగౌరవ ప్రతీక!

| Edited By: KVD Varma

Jul 16, 2021 | 1:03 PM

KV Krishna Rao: చాలా మంది ప్రభుత్వంలో ఉన్నతాధికారులుగా పనిచేస్తారు. వారి పని వారు చేసుకుపోయే వారు కొందరు ఉంటారు.

KV Krishna Rao: పాకిస్తాన్ కంటి మీద కునుకు లేకుండా చేసిన తెలుగు వీరుడు కేవీ కృష్ణారావు..భారత సైన్యపు ఆత్మగౌరవ ప్రతీక!
Kv Krishna Rao
Follow us on

KV Krishna Rao: చాలా మంది ప్రభుత్వంలో ఉన్నతాధికారులుగా పనిచేస్తారు. వారి పని వారు చేసుకుపోయే వారు కొందరు ఉంటారు. మరికొందరు తాము ఆ పదవిలో ఉండగా డానికి ఎంత న్యాయం చేశామనే కోణంలో పనిచేస్తారు. వారు ఏ పదవిలో ఉన్నా.. నిబద్ధతతో పనిచేసి గౌరవ మర్యాదలు దక్కించుకుంటారు. అదేవిధంగా కొంతమంది తాము నిర్వర్తిస్తున్న విధులతో ప్రజలకు కూడా గుర్తుండిపోయేలా పనిచేస్తారు. ఇలా పదవుల్లో గౌరవ మర్యాదలు పొందటంతో పాటు..తమ వ్యవహార శైలితో ప్రజలకు కూడా గుర్తుండిపోయే అధికారులు కొందరే ఉంటారు. వారిలో మాజీ ఆర్మీ చీఫ్ జనరల్.. మన తెలుగు వీరుడు కె.వి.కృష్ణారావు ఒకరు. ఆయన జయంతి ఈరోజు (16 జూలై 1923). ఈ సందర్భంగా ఆయన గురించిన కొన్ని విశేషాలు సంక్షిప్తంగా..

జనరల్ కె.వి.కృష్ణారావు భారత సైన్యం ఆర్మీ స్టాఫ్ 14 వ చీఫ్ గా నాలుగు దశాబ్దాల పాటు పనిచేశారు. ఆయన ఆగష్టు 9, 1942 న సైన్యంలో విధులలో చేరారు. యువ ఆర్మీ అధికారిగా ఆయన రెండవ ప్రపంచ యుద్ధంలో బర్మా, నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్, బలూచిస్తాన్లలో పనిచేశారు.

1947 లో విభజన వరకు విస్తృతమైన పంజాబ్ అవాంతరాల సమయంలో, అతను తూర్పు, పశ్చిమ పంజాబ్ లలో పనిచేశారు. జమ్మూ కాశ్మీర్‌లో పాకిస్తాన్‌పై 1947-48 యుద్ధంలో పాల్గొన్నారు. ఆయన 1949-51 మధ్యకాలంలో నేషనల్ డిఫెన్స్ అకాడమీ వ్యవస్థాపక బోధకుడిగా వ్యవహరించారు.

జనరల్ రావు 1965-66 మధ్య లడఖ్ ఫార్వర్డ్ ఏరియాలో ఒక బ్రిగేడ్, 1969-70 మధ్య జమ్మూ రీజియన్లో పదాతిదళ విభాగంలో విధులు నిర్వహించారు.

1970-72 మధ్యకాలంలో నాగాలాండ్, మణిపూర్ లలో ఆయన కీలకమైన విభాగాలలో పనిచేశారు. ఈ కాలంలో, ఆయన పనిచేస్తున్న విభాగం 1971లో జరిగిన భారత-పాకిస్తాన్ యుద్ధంలో కూడా పాల్గొంది. సిల్హెట్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవడంలో, ఈశాన్య బంగ్లాదేశ్ విముక్తికి కీలక పాత్ర పోషించింది. ఈ యుద్ధంలో అత్యుత్తమ నాయకత్వం, ధైర్యం, సంకల్పం, డ్రైవ్‌ను ప్రదర్శించినందుకు ఆయనకు పరమ విశిష్ట సేవా పతకం లభించింది.

1975-76 మధ్యకాలంలో, దేశ భవిష్యత్ రక్షణ కోసం పునర్వ్యవస్థీకరణ మరియు ఆధునీకరణపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ ఛైర్మన్‌గా కూడా ఆయన వ్యవహరించారు. అతను 1978-79 మధ్య ఆర్మీ ప్రధాన కార్యాలయంలో డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ గా పనిచేశారు. తదనంతరం, ఆతను పదోన్నతి పొందారు. 1979-81 మధ్య కాలంలో వెస్ట్రన్ కమాండ్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్ గా పనిచేశారు.

జనరల్ రావు జూన్ 1, 1981 న చీఫ్ ఆర్మీ స్టాఫ్‌గా నియమితులయ్యారు. జూలై 1983 వరకు ఆ సామర్థ్యంలో పనిచేశారు. మార్చి 1982 నుండి జూలై 1983 వరకు సర్వీసులలో అత్యున్నత నియామకం అయిన చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ ఛైర్మన్‌గా కూడా ఉన్నారు.

జూన్ 1984 నుండి జూలై 1989 వరకు, జనరల్ రావు ఈశాన్య రాష్ట్రాలైన నాగాలాండ్, మణిపూర్, త్రిపుర గవర్నర్‌గా ఉన్నారు. ఆయన జూన్ 1988 లో మిజోరాం గవర్నర్ గా కూడా పనిచేశారు.

జనరల్ కృష్ణారావును 1989-90 మధ్య జమ్మూ కాశ్మీర్ గవర్నర్‌గా నియమించారు. జమ్మూ కాశ్మీర్‌లో రాష్ట్రంలో ఉగ్రవాదం తారాస్థాయికి చేరుకున్న సమయంలో, ఆయనను తిరిగి గవర్నర్‌గా నియమించారు. మార్చి 1993 నుంచి మే 1998 వరకు అక్కడ పనిచేశారు. ఈ సమయంలో అక్కడ శాంతి, ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు.

దేశానికి ఎంతో ఉన్నతమైన సేవలు అందించిన జనరల్ కేవీ కృష్ణారావు తన 92వ ఏట 2016 జనవరి 30 వ తేదీన గుండెపోటుతో ఢిల్లీ సైనిక ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు.

Also Read: America Military: ఆప్ఘనిస్తాన్ నుంచి అమెరికా దళాల ఉపసంహరణ..అమెరికా అక్కడ పెట్టిన ఖర్చు తెలిస్తే అమ్మో అంటారు!

UP Elections 2022: యూపీలో వేడెక్కిన ఎన్నికల రాజకీయాలు.. అసద్ ఎంట్రీతో బీజేపీకే లాభమా?