
తిరుమల పరకామణి కేసులో కీలక వ్యక్తి.. టీటీడీ మాజీ AVSO సతీష్కుమార్ మృతిపై అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ముందుగా సస్పెక్ట్ డెత్ అని భావించిన పోలీసులు.. ఆ తర్వాత.. స్పాట్లోని పరిస్థితులు.. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో హత్య కేసుగా నమోదు చేశారు. ఆ తర్వాత.. గుంతకల్ రైల్వే పోలీసుల నుంచి తాడిపత్రి పీఎస్కు కేసు ట్రాన్సఫర్ అవడంతో వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో సీసీ ఫుటేజ్ కూడా కీలకంగా మారింది. గురువారం రాత్రి 11 గంటల 50 నిమిషాలకు సతీష్కుమార్.. గుంతకల్ రైల్వేస్టేషన్కు చేరుకోగా.. అక్కడే బైక్ పార్క్ చేసిట్లు సీసీ ఫుటేజ్లో కనిపిస్తోంది. దీంతో.. రైల్వేస్టేషన్ పార్కింగ్లో ఉన్న ఆయన బైక్ను గుర్తించారు. బైక్ పార్క్ చేసిన తర్వాత అర్థరాత్రి ఒంటి గంటకు గుంతకల్ నుంచి తిరుపతికి వెళ్లేందుకు రాయలసీమ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఎక్కినట్లు తేల్చిన పోలీసులు.. ఆ ట్రైన్లోని ఎవిడెన్స్ సేకరించే పనిలో పడ్డారు. ట్రైన్లో సెక్యూరిటీగా ఉండే RPF పోలీసులను ప్రశ్నించారు.
రాయలసీమ ఎక్స్ప్రెస్ A1 బోగిలో సతీష్కుమార్ ప్రయాణం
సతీష్కుమార్.. రాయలసీమ ఎక్స్ప్రెస్ A1 బోగిలో ప్రయాణించారు. బోగీలోని ప్రయాణికుల లిస్ట్ ఆధారంగానూ దర్యాప్తు చేస్తున్నారు. దీంతోపాటు.. A1 బోగి CTE అప్పారావును తిరుపతి రైల్వే స్టేషన్లో జీఆర్పీ డీఎస్పీ హర్షిత ఆధ్వర్యంలో విచారించారు. సతీష్కుమార్ ట్రైన్ ఎక్కడ ఎక్కాడు?.. బోగిలో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారు?.. అనుమానితులను చూశారా?.. అన్న కోణంలో పోలీసులు ఎంక్వైరీ చేశారు. శబ్ధం ఏమైనా వచ్చిందా?.. రైలు బోగిలోనే హత్య జరిగి ఉంటే తిరుపతికి చేరుకున్న రైలులో రక్తపు మరకలు ఏమైనా గుర్తించారా అన్న కోణంలోనూ ఆరా తీస్తున్నారు. మరోవైపు.. సీసీ ఫుటేజ్లో సతీష్కుమార్ దగ్గర వైట్ బ్యాగ్ ఉంది. మరి.. రైలు బోగిలో ఆయన లగేజ్ ఏమైంది?.. రైలు బోగిని శుభ్రం చేసే టైమ్లో లగేజ్ ఉందా?.. లేదా?.. అనే అంశాలపైనా పోలీసులు ఫోకస్ పెట్టారు. అంతేకాదు.. సతీష్ రివాల్వార్ ఎక్కడుంది?.. అనే మరో కీలక అంశాన్ని దర్యాప్తు చేస్తున్నారు.
అర్ధరాత్రి 1.20ని.లకు భార్యకు సతీష్ 4సార్లు ఫోన్
సతీష్కుమార్ డెత్ మిస్టరీలో మరికొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గురువారం అర్థరాత్రి ఒంటి సమయంలో ట్రైన్ ఎక్కిన సతీష్కుమార్.. ఒంటి గంటా 20నిమిషాలకు తన భార్యకు నాలుగు సార్లు ఫోన్ చేశాడు. ఆమె ఫోన్ లిఫ్ట్ చేయపోవడంతో డిస్కంఫర్ట్గా ఉన్నట్లు ఇంగ్లీష్లో మెసెజ్ పెట్టేసాడు. ఆ తర్వాత.. 2 నుంచి 3గంటల సమయంలో ఘటన జరిగినట్లు పోస్టుమార్టం రిపోర్ట్లో వెల్లడైంది. అయితే.. సతీష్కుమార్ డెడ్బాడీ 70అడుగులు దూరంలో పడి ఉన్నప్పుడు.. అతని ఫోన్ కూడా ఎంతో కొంత దెబ్బతినాలి.. కానీ.. ఎలాంటి చెక్కుచెదరకుండా ఉండడం మరింత అనుమానాలకు తావిస్తోంది.
సతీష్కుమార్ మృతిపై పలు అనుమానాల నేపథ్యంలో ఘటనాస్థలంలో సీన్రీకన్స్ట్రక్షన్ చేశారు పోలీసులు. సతీష్కుమార్ బరువుతో సమానమైన ఓ బొమ్మను చెన్నై ఎగ్మోర్ ఎక్స్ప్రెస్ ట్రైన్ నుంచి విసిరారు. సతీష్కుమార్ డెడ్బాడీ 70అడుగుల దూరంలో ఉండడంపై.. సీన్ రీకన్స్ట్రక్షన్తో వెరిఫై చేశారు. మొత్తంగా.. ఒక్క మర్డర్లో.. పలు రకాల అనుమానాలు పోలీసులకు సవాళ్లుగా మారిన నేపథ్యంలో విచారణలో ఏం తేలనుందో చూడాలి..