
తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరిగింది.. చలిగాలులతో ప్రజలు గజగజ వణికిపోతున్నారు. బయటకు వచ్చేందుకు జంకుతున్నారు.. అయితే.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్కు పడిపోయాయి. చాలా ప్రాంతాల్లో కోల్డ్ వేవ్స్ వణికిస్తున్నాయి. ఈ తరుణంలో వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది.. కొన్ని ప్రాంతాల్లో చలి తీవ్రత పెరుగుతుందని.. మరికొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మూడు రోజుల వెదర్ రిపోర్ట్ ఎలా ఉందో ఈ కథనంలో తెలుసుకుందాం..
అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణములో ఉత్తర – ఈశాన్య దిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు ఈ కింది విధంగా ఉన్నాయి..
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాం :– బుధవారం, గురువారం, శుక్రవారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశము ఉంది.
దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్:- బుధవారం, గురువారం తేలికపాటినుండి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. శుక్రవారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశము ఉంది.
రాయలసీమ:- బుధవారం, గురువారం తేలికపాటినుండి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. శుక్రవారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశము ఉంది.
గమనిక :- రాగల 3 రోజుల్లో కోస్తా ఆంధ్రప్రదేశ్, యానము, రాయలసీమలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదులో గణనీయమైన మార్పు ఉండదు. ఆ తర్వాత 2 రోజుల్లో ఒకటి లేదా రెండు చోట్ల సాధారణము కంటే 2-3 డిగ్రీల సెంటీగ్రేడ్ తక్కువగా నమోదయ్యే అవకాశముంది.
హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం.. తెలంగాణ రాష్ట్రంలో క్రింది స్థాయి గాలులు ప్రధానముగా తూర్పు, ఆగ్నేయ దిశల నుండి వీస్తున్నవి.. రాగల 3 రోజులు ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశం ఉంది.. బుధవారం, గురువారం, శుక్రవారం రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. రాబోయే రెండు రోజుల్లో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3°C నుండి 5°C తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది.
ఈరోజు కొన్ని ఉత్తర, పశ్చిమ తెలంగాణ జిల్లాలలో అక్కడక్కడ చలిగాలులు వీచే అవకాశం ఉంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..