Andhra Pradesh: శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తజనం.. దర్శనానికి 5 గంటలు

శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. సోమవారం కావడంతో స్వామి అమ్మవార్ల దర్శనానికి 5 గంటలు సమయం పడుతుందని ఆలయ అధికారులు అంటున్నారు. నంద్యాల జిల్లా శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయానికి భారీగా భక్తుల రద్దీ పెరిగింది. ఈ రోజు సోమవారం కావడంతో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. క్షేత్రమంత భక్తజనంతో సందడి నెలకొంది. భక్తులు వేకువజాము నుంచే..

Edited By:

Updated on: Dec 18, 2023 | 8:06 AM

నంద్యాల, డిసెంబర్‌ 18: శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. సోమవారం కావడంతో స్వామి అమ్మవార్ల దర్శనానికి 5 గంటలు సమయం పడుతుందని ఆలయ అధికారులు అంటున్నారు. నంద్యాల జిల్లా శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయానికి భారీగా భక్తుల రద్దీ పెరిగింది. ఈ రోజు సోమవారం కావడంతో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. క్షేత్రమంత భక్తజనంతో సందడి నెలకొంది. భక్తులు వేకువజాము నుంచే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్ల దర్శనార్థమై క్యూలైన్స్ లో దర్శన కంపార్టుమెంట్లలో బారులు తీరారు.

శ్రీ స్వామి అమ్మవారి దర్శనానికి సుమారు 5 గంటల సమయం పడుతుంది. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ క్యూలైన్లలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా శ్రీస్వామి అమ్మవార్లను దర్శించుకునేలా ఆలయ ఈవో పెద్దిరాజు ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దర్శనార్థమై క్యూలైన్లు, కంపార్ట్మెంట్లలో ఉన్న భక్తులకు ఎప్పటికప్పుడు అల్పాహారం, పాలు, మంచినీరు అందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us