వేర్వేరు ప్రమాదాల్లో ఒకరు మృతి, చిన్నారులకు గాయాలు
ప్రకాశం జిల్లాలో జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఒకరు చనిపోగా పలవురు చిన్నారులు గాయపడ్డారు. దర్శి మండలంలో స్కూల్ బస్సు ప్రమాదానికి గురికాగా, కనిగిరిలో జరిగిన ప్రమాదంలో భైరవకోన దేవస్థానం ఈవో ప్రాణాలు కొల్పోయాడు. ప్రకాశం జిల్లా భైరవకోన దేవస్థానం ఈవో నారాయణరెడ్డి(48) కారులో మార్కాపురంకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఆయనతో పాటు మార్కాపురంకు చెందిన మరో వ్యక్తి కారులో వెళ్తుండగా కనిగిరి మండలం చల్లగిరిగల వద్ద కారు రోడ్డు పక్కన ఉన్న బ్రిడ్జిని ఢీకొట్టింది. ఒక్కసారిగా […]
ప్రకాశం జిల్లాలో జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఒకరు చనిపోగా పలవురు చిన్నారులు గాయపడ్డారు. దర్శి మండలంలో స్కూల్ బస్సు ప్రమాదానికి గురికాగా, కనిగిరిలో జరిగిన ప్రమాదంలో భైరవకోన దేవస్థానం ఈవో ప్రాణాలు కొల్పోయాడు. ప్రకాశం జిల్లా భైరవకోన దేవస్థానం ఈవో నారాయణరెడ్డి(48) కారులో మార్కాపురంకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఆయనతో పాటు మార్కాపురంకు చెందిన మరో వ్యక్తి కారులో వెళ్తుండగా కనిగిరి మండలం చల్లగిరిగల వద్ద కారు రోడ్డు పక్కన ఉన్న బ్రిడ్జిని ఢీకొట్టింది. ఒక్కసారిగా శబ్దం రావడంతో ఇళ్లలో ఉన్నవారు బయటికి వచ్చారు. ప్రమాదానికి గురైన కారును గమనించిన స్థానికులు హుటాహుటినా తీవ్రంగా గాయపడిన ఈవో నారాయణరెడ్డిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే నారాయణ రెడ్డి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
కాగా మృతి చెందిన నారాయణరెడ్డికి భార్య కూతురు, కొడుకు ఉన్నారు. జిల్లాలో జరిగిన మరో ప్రమాదంలో ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు ప్రమాదానికి గురైంది. చింతల పాలెం దగ్గర విద్యార్థులతో వెళ్తున్న స్కూల్ బస్సు పల్టీలు కొట్టింది. ఎస్వీఆర్ స్కూల్కు చెందిన బస్సు అతివేగం కారణంగా అదుపుతప్పి పంట కాలువలో బోల్తా కొట్టింది. కాలువలో నీళ్లు ఉండడంతో.. విద్యార్థులకు ప్రాణాపాయం తప్పింది. ఆరుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.