సీఎం జగన్ లండన్ టూర్ అనుమతిపై ఉత్కంఠ.. కోర్టు తీర్పు ఎప్పుడంటే..
లండన్ వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని ఏపీ సీఎం జగన్ నాంపల్లి సిబిఐ కోర్టులో పిటిషన్ వేశారు. మే 17న లండన్కు తన సతీమణి భారతితో కలిసి వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని పిటిషన్లో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా ఉన్న సీఎం జగన్ మే 13 పోలింగ్ తరువాత లండన్ టూర్ ప్లాన్ చేశారు. తన ఇద్దరు కూతుళ్లు హర్షితా రెడ్డి, వర్షితా రెడ్డిలతో సరదాగా గడిపేందుకు తన సతీమణి భారతితో కలిసి లండన్ వెళ్లనున్నారు. ప్రతి ఏటా సీఎం జగన్ తన ఇద్దరు కుమార్తెలు వద్దకు వెళ్తూ ఉంటారు.
లండన్ వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని ఏపీ సీఎం జగన్ నాంపల్లి సిబిఐ కోర్టులో పిటిషన్ వేశారు. మే 17న లండన్కు తన సతీమణి భారతితో కలిసి వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని పిటిషన్లో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా ఉన్న సీఎం జగన్ మే 13 పోలింగ్ తరువాత లండన్ టూర్ ప్లాన్ చేశారు. తన ఇద్దరు కూతుళ్లు హర్షితా రెడ్డి, వర్షితా రెడ్డిలతో సరదాగా గడిపేందుకు తన సతీమణి భారతితో కలిసి లండన్ వెళ్లనున్నారు. ప్రతి ఏటా సీఎం జగన్ తన ఇద్దరు కుమార్తెలు వద్దకు వెళ్తూ ఉంటారు. గతంలో 2019 ఎన్నికల సమయంలోనూ సీఎం జగన్ పోలింగ్ ముగించుకుని కూతుళ్ల వద్దకు వెళ్లి కౌంటింగ్కు ముందు తిరిగి భారతదేశానికి వచ్చారు. ఈ క్రమంలోనే ఈసారి కూడా ఎన్నికలు ముగించుకుని లండన్ వెళ్లేందుకు అనుమతి కోరుతూ నాంపల్లి సీబీఐ కోర్టును ఆశ్రయించారు. దీని కోసం అబ్రాడ్ వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోర్టులో పిటిషన్ వేశారు. పిటిషన్ విచారణకు స్వీకరించిన న్యాయస్థానం సీబీఐకి కౌంటర్ దాఖలు చేయాలని కోరింది. దీనిపై సీబీఐ న్యాయవాదులు కౌంటర్ దాఖలు చేశారు.
సీఎం జగన్కు లండన్ వెళ్లేందుకు అనుమతి ఇవ్వకూడదని కోర్టుకు తెలిపారు. ఇప్పటికే సీఎం జగన్ పై 11 కేసులు విచారణలో ఉన్నయని, విచారణ జరుగుతున్న సమయంలో విదేశాలనకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వడం సరైంది కాదని న్యాయమూర్తికి తెలిపారు. ఈ కేసులన్నింటిలో సీఎం జగన్ ప్రధాన ముద్దాయిగా ఉన్నారని సీబీఐ వాదించింది. పైగా మే15న జగన్ ప్రధాన కేసు విచారణ ఉందని కోర్టుకు తెలిపింది. ఇదిలా ఉంటే సీఎం జగన్ తరఫు న్యాయవాదులు కూడా తమ వాదనలు వినిపించారు. గతంలో కూడా సీఎం జగన్ అనేక సార్లు విదేశాలకు వెళ్లారని ఎక్కడ కూడా కోర్టు నిబంధనలు ఉల్లంఘించలేదని న్యాయమూర్తికి తెలిపారు. రైట్ టూ ట్రావెల్స్ అబ్రాడ్ అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు అని దానిని కాలరాయడం సరైన విధానం కాదని సీఎం జగన్ తరఫు లాయర్లు కోర్టుకు తెలిపారు. సీఎం జగన్ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రాజ్యాంగబద్దమైన పదవిలో ఉన్నారని, ఆయనను నమ్ముకుని పార్టీ ఉందని, ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడరని వివరించారు. అందుకే విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోర్టును కోరారు న్యాయవాదులు. ఇరు వాదనలు విన్న న్యాయస్థానం ఈ కేసు తీర్పును మే 14కు వాయిదా వేసింది. సీఎం జగన్ లండన్ పర్యటనకు వెళ్లేందుకు అనుమతి లభిస్తుందా లేదా అన్న ఉత్కంఠ అటు అభిమానుల్లో, పార్టీ శ్రేణుల్లో నెలకొంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..