Vijayasai Reddy : ఆ స్థలంలో అక్రమంగా థియేటర్ నిర్మించారు.. టీడీపీ ఎమ్మెల్యే గణబాబుపై విజయసాయి సంచలన ఆరోపణలు..

|

Jan 01, 2021 | 10:17 AM

Vijayasai Reddy : భూ ఆక్రమణలకు సంబంధించి విశాఖ పశ్చిమ నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే గణబాబుపై ఎంపీ విజయసాయి సంచలన ఆరోపణలు చేశారు.

Vijayasai Reddy : ఆ స్థలంలో అక్రమంగా థియేటర్ నిర్మించారు.. టీడీపీ ఎమ్మెల్యే గణబాబుపై విజయసాయి సంచలన ఆరోపణలు..
Vijayasai Reddy
Follow us on

Vijayasai Reddy : భూ ఆక్రమణలకు సంబంధించి విశాఖ పశ్చిమ నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే గణబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయి సంచలన ఆరోపణలు చేశారు. గణబాబు జిల్లా పరిషత్ స్థలం కబ్జా చేసి అందులో నరసింహ థియేటర్ నిర్మాణం చేపట్టారని ఆరోపించారు. విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో జరిగిన పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన ప్రసంగించారు. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమిస్తే ఎంతటి వారైనా సరే విడిచిపెట్టమని హెచ్చరించారు. ఇప్పటికే పలువురు టీడీపీ నేతలు కబ్జా చేసిన ప్రభుత్వ స్థలాలను తిరిగి స్వాధీనం చేసుకోవడం జరిగిందని ఆయన గుర్తు చేశారు. ఇదే సమయంలో రాజధాని తరలింపుపైనా కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖకు రాజధాని రావడం ఖాయం అని స్పష్టం చేశారు. రాజధానికి అనుకూలమైన ప్రాంతం విశాఖ అని పేర్కొన్నారు. వంద మంది చంద్రబాబులు అడ్డు వచ్చినా రాజధాని తరలింపు ఆగదంటూ ఉద్ఘాటించారు.

 

Also read:

ధరణి పోర్టల్‌ ఆశించిన ఫలితాలు.. జిల్లా కలెక్టర్లకు మరిన్ని బాధ్యతలు.. భూవివాదాలను రెండు నెలల్లో పరిష్కరించాలన్న సీఎం

విశాఖకు చెందిన దంపతులకు అరుదైన గుర్తింపు.. ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గోనేందుకు అవకాశం