జనసేనకు ఝలక్.. మూడు రాజధానులకు ఓటేస్తానంటున్న రాపాక

| Edited By:

Jan 20, 2020 | 10:21 AM

జనసేన పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ వైపు జనసేన పార్టీ.. రాజధానిగా అమరావతిని కొనసాగించాలని ఆందోళనకు దిగుతూ.. మూడు రాజధానుల అంశాన్ని వ్యతిరేకిస్తుంటే.. మరో వైపు ఉన్న ఒక్క ఎమ్మెల్యే రూట్ మార్చారు. తాను మూడు రాజధానుల అంశంపై ఓటింగ్ పెడితే.. అనుకూలంగా ఓటేస్తానని స్పష్టం చేశారు. తన మద్దతు మూడ రాజధానులకేనంటూ తేల్చేశారు. ఇవాళ జరిగే ప్రత్యేక అసెంబ్లీ సమావేశంలో మూడు రాజధానుల అంశంపై చర్చ జరిగితే, […]

జనసేనకు ఝలక్.. మూడు రాజధానులకు ఓటేస్తానంటున్న రాపాక
Follow us on

జనసేన పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ వైపు జనసేన పార్టీ.. రాజధానిగా అమరావతిని కొనసాగించాలని ఆందోళనకు దిగుతూ.. మూడు రాజధానుల అంశాన్ని వ్యతిరేకిస్తుంటే.. మరో వైపు ఉన్న ఒక్క ఎమ్మెల్యే రూట్ మార్చారు. తాను మూడు రాజధానుల అంశంపై ఓటింగ్ పెడితే.. అనుకూలంగా ఓటేస్తానని స్పష్టం చేశారు. తన మద్దతు మూడ రాజధానులకేనంటూ తేల్చేశారు. ఇవాళ జరిగే ప్రత్యేక అసెంబ్లీ సమావేశంలో మూడు రాజధానుల అంశంపై చర్చ జరిగితే, అందుకు అనుకూలంగా చర్చలో పాల్గొంటానన్నారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందేందుకు, పరిపాలనా వికేంద్రీకరణ పరంగానూ ప్రభుత్వం చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు.