
కర్నూలు జిల్లా వెల్దుర్తి గ్రామంలో ఇటీవల చోటుచేసుకున్న ఒక అపురూప ఘటన స్థానికులను, దేశ ప్రజలను ఆశ్చర్యానికి గురిచేసింది. స్థానిక పోలీస్ స్టేషన్ ఎదురుగా మెయిన్ రోడ్డు పక్కన ఆవుల మంద సేద తీరుతోంది. అదే సమయంలో, మందలోని ఒక గోమాత చెంతకు ఒక చిన్న పందిపిల్ల చేరుకుంది. అందరినీ ఆశ్చర్యపరుస్తూ, ఆ పందిపిల్ల గోమాత పాలు తాగడం మొదలుపెట్టింది.
సాధారణంగా వివిధ జాతుల జంతువులు ఒకదానితో ఒకటి కలిసినప్పుడు దూరం పాటించడం లేదా పోరాడటం చూస్తాం. కానీ ఈ సందర్భంలో, ఆ గోమాత ఎటువంటి కోపం లేదా ప్రతిఘటన లేకుండా, ఎంతో ప్రశాంతంగా, ప్రేమగా పందిపిల్లను పాలు తాగనిచ్చింది. పందిపిల్ల ఆవుపాలు తాగుతూ తన ఆకలిని తీర్చుకుంది.
ఈ దృశ్యం అమ్మ ప్రేమకు భాష లేదు, జాతి లేదు అనే సత్యాన్ని చాటిచెప్పింది. మానవ సంబంధాలలో కూడా జాతి, మత భేదాలు తరచుగా కనిపిస్తున్న ఈ రోజుల్లో, జంతువుల మధ్య కనిపించిన ఈ నిస్వార్థ ప్రేమ బంధం చూసి స్థానికులందరూ ఆశ్చర్యంతో పాటు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ హృదయపూర్వక సంఘటన సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారమై, అనేక మంది హృదయాలను హత్తుకుంది.
వీడియో చూడండి..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.