నాయనమ్మ అంత్యక్రియలు ముగిశాయి.. కానీ, బంగారం మాయమైంది.. చిన్న అనుమానంతో ఆరాతీస్తే..

గుంటూరు జిల్లా పెదనందిపాడుకు చెందిన 75 ఏళ్ల సుబ్బాయమ్మ మృతి అనంతరం ఆమె ధరించిన సుమారు 52 గ్రాముల బంగారు ఆభరణాలు కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. దర్యాప్తులో బంధువైన నాంచారమ్మ ఆభరణాలను తీసుకున్నట్లు ఒప్పుకోగా, పోలీసులు రెండు గొలుసులు, మంగళసూత్రం, ఉంగరాన్ని స్వాధీనం చేసుకున్నారు. సుబ్బాయమ్మ మృతిపై కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

నాయనమ్మ అంత్యక్రియలు ముగిశాయి.. కానీ, బంగారం మాయమైంది.. చిన్న అనుమానంతో ఆరాతీస్తే..
Gold Ornaments Theft

Edited By:

Updated on: Aug 03, 2026 | 12:46 PM

గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం రావిపాడుకు చెందిన కొల్లా సుబ్బాయమ్మ వయస్సు ఢెబ్బై ఐదు సంవత్సరాలు.. ఈ ఏడాది ఏప్రిల్ 12వ తేదని ఆమె తమ్ముడు చనిపోయినట్లు కబురు వచ్చింది. దీంతో ఆమె కాకుమాను మండలం పాండ్రపాడు వెళ్లింది. అక్కడ తమ్ముడు అంత్యక్రియల్లో పాల్గొంది. ఆమె అదే రోజు ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆమె మనమడు కొల్లా వెంకటేష్.. బంధువైన నాంచారమ్మకు ఫోన్ చేసి అడిగాడు. చిన్నదినం కూడా చూసుకుని వస్తుందిలే అని సమాధానం చెప్పారు. దీంతో సరేనంటూ వెంకటేష్ ఫోన్ పెట్టేశాడు. అయితే పదమూడో తేదిన వెంకటేష్ కు నాంచారామ్మ వద్ద నుండి ఫోన్ వచ్చింది. కొల్లా సుబ్బాయమ్మ కూడా మృతి చెందినట్లు నాంచారమ్మ చెప్పింది. దీంతో వెంకటేష్ గ్రామానికి వెళ్లి నాయనమ్మ మృతదేహాన్ని తమ స్వగ్రామమైన రావిపాడుకు తీసుకొచ్చారు. అక్కడ ఆమె అంత్యక్రియలు పూర్తి చేశారు.

అయితే ఇంత వరకు బాగానే ఉంది.. కానీ, ఆమె వంటిపై యాభై రెండు గ్రాముల బంగారు ఆభరణాలున్నట్లు వెంకటేష్ కు తెలిసింది. వాటి విలువ ఆరు లక్షల రూపాయలని బంధువులు చెప్పారు. బంగారు ఆభరణాల గురించి మొదట నాంచారమ్మకే ఫోన్ చేసి వెంకటేష్ అడిగాడు. అయితే ఆభరణాల గురించి తనకు తెలియదని చెప్పింది. ఇక చేసేదేమి లేక వెంకటేష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

రంగంలోకి దిగిన పోలీసులు అనుమానితులను అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించగా సుబ్బాయమ్మ ఆభరణాలను తానే దొంగలించినట్లు నాంచారమ్మ ఒప్పుకుంది. ఆమె వద్ద నుండి రెండు చైన్లు, ఒక ఉంగరం, మంగళ సూత్రాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సుబ్బాయమ్మ మృతిపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us