Big News Big Debate: సామాజిక రాజనీతి.. వైసీపీ టార్గెట్‌ బీసీలేనా..?

|

Feb 21, 2023 | 7:02 PM

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీలు సామాజిక సమీకరణాలపై ఫోకస్‌ పెంచాయి. బీజేపీలో సీనియర్లు కాపుల జపం చేస్తుంటే.. యాత్రలతో టీడీపీ కులాల వారీగా సమావేశాలు నిర్వహిస్తోంది.

Big News Big Debate: సామాజిక రాజనీతి.. వైసీపీ టార్గెట్‌ బీసీలేనా..?
Big News Big Debate
Follow us on

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీలు సామాజిక సమీకరణాలపై ఫోకస్‌ పెంచాయి. బీజేపీలో సీనియర్లు కాపుల జపం చేస్తుంటే.. యాత్రలతో టీడీపీ కులాల వారీగా సమావేశాలు నిర్వహిస్తోంది. సామాజిక న్యాయమే మా నినాదం అంటున్న వైసీపీ అన్ని వర్గాలకు రాజ్యాధికారం అంటూ సోషల్‌ ఇంజినీరింగ్‌ చేస్తోంది. పదవులు అలంకార ప్రాయమే తప్ప.. అధికారాలు లేవని విపక్షాలు అంటే ఎప్పుడు పదవులు దక్కని వర్గాలకు సైతం అవకాశాలు కల్పిస్తుంటే.. జీర్ణించుకోలేక డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తున్నారని విపక్షాలపై విమర్శలు గుప్పిస్తోంది వైసీపీ.

ఏపీలో బీసీ నినాదం బలంగా వినిపిస్తోంది.. ఎవరికి వారు తమ ఓటుబ్యాంకుగా మలుచుకునేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నారు..

తాజాగా వైసీపీ 18 మంది ఎమ్మెల్సీ అభ్యర్ధుల ప్రకటించడంతో మరోసారి సామాజికన్యాయం తెరమీదకు వచ్చింది. ఏపిలో బీసీలను తలెత్తుకునేలా చేశారంటూ సీఎం జగన్ పై మంత్రి జోగి రమేశ్ పొగడ్తల వర్షం కురిపించారు. 75 ఏళ్ల దేశ చరిత్రలో ఏపీలో మాత్రమే సామాజిక న్యాయం జరిగిందంటున్నారు మంత్రులు. బీసీలకు పెద్ద పీట వేశారంటూ రాష్ట్రవ్యాప్తంగా కేడర్‌ పాలాభిషేకాలు.. సంబరాలు జరుపుకున్నారు.

ఇవి కూడా చదవండి

అసెంబ్లీ నుంచి పారిపోయిన చంద్రబాబు.. రోడ్లపైకి ఏదేదో మాట్లాడుతున్నారన్న వైసీపీ.. బలహీన వర్గాలకు ఏ ప్రభుత్వం న్యాయం చేసిందో చర్చించేందుకు దమ్ముంటే అసెంబ్లీకి రావాలని సవాల్‌ చేశారు మంత్రులు. ఒకప్పుడ దళితుల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా అన్న చంద్రబాబు.. వైసీపీ చేస్తున్న సామాజిక న్యాయం నుంచి దృష్టి మళ్లించేందుకు గన్నవరం వంటి అంశాలు తెరమీదకు తీసుకొస్తున్నారన్నారు.

పార్టీల ఫోకస్‌ అంతా కూడా ఎన్నికలే… రాబోయే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా ఆయా సంఘాలతో సమావేశాలు నిర్వహిస్తున్నాయి. అధికారంలో భాగస్వామ్యం అంటూ నినాదాలు వినిపిస్తున్నాయి. పార్టీల ప్రయత్నాలు ఫలిస్తాయా? బలహీన వర్గాల ప్రజలు ఏ ఎవరికి ఓటుబ్యాంకుగా మారబోతున్నారు?

బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ వీడియో చూడండి..

మరిన్ని ఏపీ వార్తల కోసం..