Rains: ఏపీకి భారీ రెయిన్ అలర్ట్.. 16 జిల్లాలకు ఎల్లో హెచ్చరిక.. వాతావరణశాఖ అప్డేట్ ఇదే..

దక్షిణ చత్తీస్గఢ్ పరిసర ప్రాంతాలపై కేంద్రీకృతమైన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాంధ్రతో పాటు కోస్తా జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వానలు పడుతున్నాయి. తీర ప్రాంతంలో బలమైన గాలులు వీస్తుండటంతో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని వాతావరణశాఖ హెచ్చరించింది.

Rains: ఏపీకి భారీ రెయిన్ అలర్ట్.. 16 జిల్లాలకు ఎల్లో హెచ్చరిక.. వాతావరణశాఖ అప్డేట్ ఇదే..
Rains

Updated on: Sep 13, 2026 | 9:37 AM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కీలక ప్రకటన చేసింది. విదర్భ, మధ్యప్రదేశ్ ప్రాంతాలపై అల్పపీడనం కేంద్రీకృతమైన స్పష్టం చేసింది. దీని ప్రభావంతో రాబోయే 24 గంటల్లో పశ్చిమ-వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో ఆదివారం అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే సూచనలు కనిపిస్తున్నాయని అంచనా వేసింది. ఉత్తరాంధ్ర తీరం వెంబడి 40-60 కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని,  రాగల మూడు గంటలు కాకినాడ, విశాఖ ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, నంద్యాల, కర్నూలు జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని హెచ్చరించింది. పిడుగులు, ఈదురుగాలుల వేళ చెట్లు, హోర్డింగ్స్ కింద నిలబడవద్దని ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. పొంగిపొర్లే వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయవద్దని సూచనలు చేసింది. భారీ వర్షాలు పడే అవకాశం ఉన్న క్రమంలో అప్రమత్తంగా ఉండాలని సూచించింది. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే వర్షాలు కురుస్తుండగా.. రాబోయే కొన్ని రోజుల పాటు వానలు కొనసాగే అవకాశముందని స్పష్టం చేసింది. దీంతో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచించింది.

ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం జిల్లాకు మోస్తరు నుంచి భారీ వర్ష సూచన ఉండగా.. విజయనగరం, మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. మరోవైపు తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణ, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ స్పష్టం చేసింది. దక్షిణ కోస్తాలో ఉన్న కృష్ణ, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయని తెలిపింది.

ఉత్తరాంధ్ర తీరంలో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్లు, దక్షిణ కోస్తా తీరం వెంబడి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. కొన్ని సందర్భాల్లో గాలుల తీవ్రత 70 కిలోమీటర్లకు కూడా పెరిగే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. తీర ప్రాంత ప్రజలతో పాటు మత్స్యకారులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని, ఈరోజు, రేపు కూడా చేపల వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. 16 జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో వార్నింగ్ జారీ చేసింది. వాతావరణ శాఖ ఇప్పటికే కోస్తా తీరం వెంబడి ఉన్న ఈ 16 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు పూర్తిగా తగ్గుముఖం పట్టగా.. తాజాగా ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో వానలు మళ్లీ మొదలయ్యాయి.

Loading...
Unable to load recommendations.
Follow Us