AP CM YS Jagan: ఏపీ సీఎం జగన్ సంచలన నిర్ణయం.. కోవిడ్‌తో అనాథలైన పిల్లలకు రూ. 10లక్షల ఆర్థిక సాయం

|

May 17, 2021 | 8:53 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. కోవిడ్ మృతుల కుటుంబాలకు ఊరటనిచ్చేలా కొత్త పథకాన్ని ప్రకటించారు.

AP CM YS Jagan: ఏపీ సీఎం జగన్ సంచలన నిర్ణయం.. కోవిడ్‌తో అనాథలైన పిల్లలకు రూ. 10లక్షల ఆర్థిక సాయం
Follow us on

AP CM YS Jagan financial assist: కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ వందలాది కుటుంబాలు పెద్దదిక్కును కోల్పోయి అనాథలుగా మారుతున్నాయి. తల్లిదండ్రులను మరణంతో రోడ్డున పడాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. కోవిడ్ మృతుల కుటుంబాలకు ఊరటనిచ్చేలా కొత్త పథకాన్ని ప్రకటించారు.

కోవిడ్‌ కారణంగా తల్లిదండ్రులు ఎవరైనా చనిపోతే వారి పిల్లలను ఆదుకునేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ నిర్ణయించారు. ఈ మేరకు తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన పిల్లల పేరిట రూ.10 లక్షలు డిపాజిట్ చేయాలని నిర్ణయించారు. వీటిపై నెలనెల వచ్చే వడ్డీతో ఆ పిల్లల కనీస అవసరాలు తీర్చేలా ఈ కార్యక్రమాన్ని అమలు చేయాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు. అలాగే, ఆ పిల్లలకు 25 ఏళ్లు నిండిన తర్వాత ఈ డిపాజిట్ మొత్తం విత్ డ్రా చేసుకునే అవకాశం కల్పించనున్నారు. ఆర్థిక సాయానికి  సంబంధించిన ఒకటి రెండు రోజుల్లో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు సమాచారం.

Read Also…  రైతులకు బంపర్‌ ఆఫర్‌.. ఈ ట్రాక్టర్ కొనుగోలు చేసిన వారికి లక్ష రూపాయల ఇన్సూరెన్స్‌ పాలసీ.. లోన్‌ సౌకర్యం