AP Corona: ఏపీలో 10 వేలు దాటిన కరోనా మరణాలు.. తాజాగా ఎన్ని పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయంటే..!

|

May 22, 2021 | 6:14 PM

AP Corona Updates: ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. కరోనా కట్టడికి ఏపీ సర్కార్‌ ఎన్నో చర్యలు చేపడుతోంది. రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య కాస్త తగ్గుముఖం పడుతోంది. గడిచిన..

AP Corona: ఏపీలో 10 వేలు దాటిన కరోనా మరణాలు.. తాజాగా ఎన్ని పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయంటే..!
Ap Corona
Follow us on

AP Corona Updates: ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. కరోనా కట్టడికి ఏపీ సర్కార్‌ ఎన్నో చర్యలు చేపడుతోంది. రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య కాస్త తగ్గుముఖం పడుతోంది. గడిచిన 24 గంటల్లో 90,609 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, కొత్తగా 19,981 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 118 మంది మృతి చెందినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇక గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి 18,336 మంది కోలుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 1.85 కోట్లకుపైగా కరోనా పరీక్షలు నిర్వహించగా, 15,62,683 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇక వీరిలో 13,41,355 మంది కోలుకోగా, 10,022 మంది మృతి చెందారు. ప్రస్తుతం 2,10,683 క్రియాశీల కేసులు ఉన్నాయి.

ఇక శనివారం నమోదైన మరణాల్లో పశ్చిమగోదావరి అత్యధికంగా 15 మంది మృతి చెందగా, చిత్తూరులో 14, తూర్పుగోదావరి 11, విశాఖ 11, గుంటూరు 10, అనంతపురం 9, కృష్ణా 9, శ్రీకాకుళం 8, విజయనగరం 8, కర్నూలు 7, నెల్లూరు 7, ప్రకారం 7, కడప జిల్లాలో ఇద్దరు చొప్పున మృతి చెందారు.

 

Mega Oxygen Tankers: దేశంలో ఆక్సిజన్ కొరత తగ్గించేందుకు ‘మేఘా’ సంస్థ మహా యజ్ఞం.. థాయిలాండ్‌ నుంచి ఆక్సిజన్‌ ట్యాంకర్లు

Oxygen: థాయిలాండ్‌ నుంచి భారత్‌కు 11 క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకర్లు.. ఉచితంగా అందించనున్న మేఘా ఇంజనీరింగ్ సంస్థ