Andhra Pradesh: పెన్షన్ విధానంపై త్వరలో ప్రత్యేక సమావేశం.. ఉద్యోగ సంఘాల భేటీలో మంత్రి బోత్స
ఏపీ సచివాలయంలో సీపీఎస్ అంశంపై ఉద్యోగ సంఘాలతో మంత్రుల కమిటీ భేటీ అయింది. మంగళవారం బ్లాక్ 2లో ఆర్థిక శాఖ కాన్ఫరెన్స్ హాలులో ఈ సమావేశం జరిగింది..
ఏపీ సచివాలయంలో సీపీఎస్ అంశంపై ఉద్యోగ సంఘాలతో మంత్రుల కమిటీ భేటీ అయింది. మంగళవారం బ్లాక్ 2లో ఆర్థిక శాఖ కాన్ఫరెన్స్ హాలులో ఈ సమావేశం జరిగింది. ఉద్యోగ సంఘాలతో జరిగిన సమావేశానికి మంత్రులు బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్, సజ్జల రామకృష్ణారెడ్డి హాజరయ్యారు. మొత్తం 13 ఉద్యోగ సంఘాలు ఈ కీలక సమావేశానికి హాజరుకాగా ఏడు సంఘాలు దూరంగా ఉన్నాయి.
ఈ ఈ సమావేశంలో సీపీఎస్ మినహా మిగిలిన అంశాలపై చర్చించారు. పెన్షన్ విధానంపై త్వరలో ప్రత్యేక సమాశం నిర్వహించనున్నట్లు మంత్రి బోత్స సత్యనారాయణ తెలిపారు. అలాగే గురుకుల టీచర్ల పదవీ విరమణ 62 ఏళ్లకు పెంచేందుకు మంత్రి అంగీకారం తెలిపారు.
అలాగే సెప్టెంబర్ 1న మిలియన్ మార్చ్ సందర్భంగా ఉద్యోగ, ఉపాధ్యాయులపై పెట్టిన అక్రమ క్రిమినల్ కేసులను వెంటనే తొలగించాలని ఉద్యోగ సంఘాల సభ్యులు అప్పలరాజు, పార్థసారధిలు డిమాండ్ చేశారు. అలాగే పెండింగ్ అంశాలపై చర్చ ఉందని జీఏడీ కార్యదర్శి నుంచి పిలుపు రావడంతోనే ఈ సమావేశానికి వచ్చామన్నారు. కొత్త డీఏలు, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ, ఉద్యోగుల హెల్త్ స్కీమ్ వంటి అంశాలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని అన్నారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం..